‘మల్లన్న’ సన్నిధిలో అత్యాధునిక క్యూ కాంప్లెక్స్
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ వర్గాలు ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అత్యాధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈమేరకు ఆలయం ముందు రాజగోపురం పక్కనున్న ప్రైవేటు వ్యక్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అందుకుగాను 11 మందికి ఆలయ నిధుల నుంచి రూ.78.46 లక్షలు పరిహారంగా అందజేశారు. భూమి కోల్పోయిన మేరకు ఆలయ ఆధీనంలోని స్థలం కేటాయించారు. రాజగోపురం
న్యూస్టుడే, చేర్యాల
రాజగోపురం పక్కన చదును చేసిన స్థలం
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ వర్గాలు ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అత్యాధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈమేరకు ఆలయం ముందు రాజగోపురం పక్కనున్న ప్రైవేటు వ్యక్తుల దుకాణాలను ఖాళీ చేయించారు. అందుకుగాను 11 మందికి ఆలయ నిధుల నుంచి రూ.78.46 లక్షలు పరిహారంగా అందజేశారు. భూమి కోల్పోయిన మేరకు ఆలయ ఆధీనంలోని స్థలం కేటాయించారు. రాజగోపురం పక్కన మొదలుకొని రేణుకాఎల్లమ్మ స్వాగత తోరణం వరకు ఉన్న ప్రైవేటు వ్యక్తుల దుకాణాల తొలగింపు ప్రక్రియ పూర్తయింది. సుమారు 2వేల గజాల స్థలం సిద్ధమైంది. ఈ ప్రదేశానికి ఆనుకొని మల్లన్న కొలువైన గుట్టలే ఉండటంతో వాటినీ చదును చేసి సుమారు ఎకరం స్థలంలో అత్యాధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని ఆలయ వర్గాలు యోచిస్తున్నాయి.
తప్పని నిరీక్షణ..
ఏటా మల్లన్న దర్శనానికి 20 లక్షల మంది ఆలయానికి తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్యం 20వేల నుంచి 40వేల మంది దర్శించుకుంటారు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ క్యూలైన్లో భక్తులు చాలా సేపు నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో రోజైతే 4 గంటలు క్యూలైన్లలో గడపాల్సి వస్తోంది .ఈ ఇబ్బందులు తొలగించేందుకే క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచనలతో ఆలయ అధికారులు, పాలక మండలి ఛైర్మన్ గీస భిక్షపతి, సభ్యులు పనులను పర్యవేక్షిస్తున్నారు. క్యూకాంప్లెక్స్కు సుమారు రూ.3 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇటీవలే నమూనా తయారు చేయించారు. అందులో ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. సేద తీరేందుకు తిరుమల తరహాలో గదులు నిర్మించి... తాగునీరు, అల్పాహార కేంద్రాలతో పాటు శౌచాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ వరుసలను ప్రస్తుతమున్న ఆలయ కార్యాలయ కింది అంతస్తులోని క్యూలైన్లకు అనుసంధానం చేస్తారు.
ఇబ్బందులు తొలగనున్నాయి..
- ఆలూరి బాలాజీ, ఈవో
భక్తులు స్వామి దర్శనానికి వరుసలో గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అత్యాధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మాణంతో ఇక్కట్లు తీరిపోతాయి. నిర్మాణానికి స్థలాన్ని సిద్ధం చేశాం. నమూనా సైతం తయారైంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా