logo

Crime News: సిద్దిపేట జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

జిల్లాలోని జగదేవపూర్‌ మండలం పీర్లపల్లి శివారులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు ప్రేమికులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 24 May 2022 23:56 IST

సిద్దిపేట: జిల్లాలోని జగదేవపూర్‌ మండలం పీర్లపల్లి శివారులో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు ప్రేమికులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మూడు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడు సిరిసిల్లా జిల్లా రాజీవ్‌నగర్‌కు చెందిన నామ వేణుగోపాల్‌గా గుర్తించారు. మృతిరాలి వివరాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని