చేపల వేటకు వెళ్లి ఇద్దరి మృతి
నీటి కుంటలో విద్యుత్తు షాక్ పెట్టి చేపలు పట్టేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు..
కనకయ్య తుమ్మల అశోక్
న్యూస్టుడే - మద్దూరు, వర్గల్: నీటి కుంటలో విద్యుత్తు షాక్ పెట్టి చేపలు పట్టేందుకు మిత్రులతో కలిసి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లపు కనకయ్య(45) వ్యవసాయం చేస్తుంటాడు. తన మిత్రులు నలుగురితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కనకయ్య చేపల కోసం పెట్టిన విద్యుత్తు షాక్ కొట్టి మృతి చెందాడని.. రాగికుంట వాగు వద్ద ఉందని మిత్రుడు మాధవరెడ్డి.. గ్రామ సర్పంచి రవీందర్కు సమాచారం ఇచ్చారు. అక్కడ సర్పంచి, గ్రామస్థులు, పోలీసులు వెళ్లి వెతకగా ఆధారాలు కనిపించలేదు. కుంటకు దూరంగా ఖాళీ స్థలంలో కనకయ్య మృతదేహం ఉంది. మిత్రులు నలుగురు ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారయ్యారు. తండ్రి రోశయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య పుష్ప, కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. మరో ఘటనలో.. చేపలు పట్టేందుకు వెళ్లిన కూలీ నీటి కుంటలో పడి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని అనంతగిరిపల్లిలో జరిగింది. గౌరారం ఎస్ఐ సంపత్కుమార్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తుమ్మల అశోక్ (40) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారడు. భార్య, 18 ఏళ్ల లోపు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్దకు వెళ్లొస్తానని చెప్పాడు. ఆదివారం తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం వేలూరు గ్రామ శివారులోని కిందికుంట వద్ద అనుమానాస్పద ఆధారాలున్నాయి. కుంటలో దిగి గాలించగా అశోక్ మృతదేహం లభ్యమైంది. భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ