కొలువు బరి..యువ గురి
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ప్రకటనలు జారీ చేస్తుంటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1, పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, తాజాగా గ్రూప్-4 ప్రకటన విడుదలైంది.
గ్రూప్-4లో శిక్షణకు చర్యలు
న్యూస్టుడే, మెదక్
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ప్రకటనలు జారీ చేస్తుంటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1, పోలీసు శాఖలో పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, తాజాగా గ్రూప్-4 ప్రకటన విడుదలైంది. సదరు ప్రక్రియ పూర్తయితే జిల్లాలోని ఆయా శాఖల్లో ఖాళీలు భర్తీ కానున్నాయి. ప్రధానంగా పురపాలిక శాఖలో ఖాళీలు భారీగా ఉండటంతో ప్రజాసమస్యలు పరిష్కారానికి నోచుకోనున్నాయి. ఇప్పటికే వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పూనుకుంది. గత మార్చిలో 80 వేల కొలువులకు ప్రకటన విడుదల చేసిన సంగతి విదితమే. అందులో జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,149 ఖాళీలు ఉన్నాయి. ఇందులో పోలీసు శాఖ ఉద్యోగాలు ఎక్కువగా ఉండగా, కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్-1 పోస్టులకు ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. చాలా ఏళ్ల తర్వాత ఉద్యోగాల భర్తీ జరుగుతుండడంతో నిరుద్యోగులు సన్నద్ధమవుతున్నారు.
పురపాలికల్లో అత్యధికం..
ప్రస్తుత ప్రకటనలో పురపాలక శాఖలో అత్యధికంగా ఖాళీలున్నాయి. 2,701 పోస్టులకు 1,862 వార్డు అధికారుల పోస్టులున్నాయి. వీరిని ఆయా పురపాలికల్లోని వార్డుకొకరిని నియమించనున్నారు. దీంతో పౌరసమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. జిల్లా కేంద్రం మెదక్లో 32 వార్డులు, తూప్రాన్లో 16, నర్సాపూర్లో 15, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. ఈ లెక్కన 75 మంది వార్డు అధికారుల నియామకం జరగనుంది. ప్రస్తుతం వార్డు కమిటీలు ఉండగా, అవి నామమాత్రంగానే పని చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు, నిధుల విడుదల వివరాలు తదితర అంశాలను వార్డు ప్రజలకు వివరించేందుకు వార్డు అధికారులు కృషి చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖలో 51, పంచాయతీరాజ్ శాఖలో 34, పోలీసు శాఖలో మూడు పోస్టులు జూనియర్ అసిస్టెంట్ స్థాయివి ఖాళీగా ఉన్నాయి.
ఉచితంగా..
అభ్యర్థులకు తర్ఫీదు
సర్కారు కొలువు సాధనకు కఠోరంగా శ్రమించాల్సిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో మంది ఉద్యోగాలు దొరక్క ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏళ్ల తర్వాత భర్తీ జరుగుతుండగా నిరుద్యోగులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అందుకు తగిన శిక్షణ అవసరం. ప్రైవేటుగా శిక్షణ పొందాలంటే రూ.వేలు వెచ్చించాల్సిందే. ఆర్థికస్థోమత కారణంగా చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి వారికి జిల్లాలోని సంక్షేమ శాఖలు ఉచితంగా శిక్షణ అందిస్తోంది. గత ఏప్రిల్లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్-4 పరీక్షకు 68 మందికి తర్ఫీదు ఇచ్చారు. గత నెలలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్ట్స్ విభాగం)లో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం 75 మంది తరగతులకు హాజరవుతున్నారు. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో శిబిరం సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను భాజపా అమ్మేస్తోంది: సీఎం రేవంత్రెడ్డి
[ 26-04-2024]
సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!