నిధులొచ్చినా.. ర్లక్ష్యమే!
పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పనులు చేపట్టేందుకు నిధులొచ్చినా.. మధ్యలోనే నిలిచిపోయాయి.
జిల్లాలో ఏసీడీపీ పనుల తీరిది
దిడ్గిలో సీసీ వేయాల్సిన దారి..
న్యూస్టుడే, సంగారెడ్డిఅర్బన్, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, జిన్నారం: పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పనులు చేపట్టేందుకు నిధులొచ్చినా.. మధ్యలోనే నిలిచిపోయాయి. శాసన సభ్యులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం(ఏసీడీపీ) నిధులు మంజూరు చేసింది. ఆయా నిధులతో జిల్లాలో చాలా చోట్ల పనులు చేపట్టినా మధ్యలోనే నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో తట్టెడు మట్టైనా తీయలేదు. ఈ నేపథ్యంలో పనుల ప్రగతి తీరుపై కథనం.
రెండు ఆర్థిక సంవత్సరాల్లో..
* ప్రతి నియోజకవర్గానికి రూ.2.50 కోట్ల చొప్పున గతేడాది(2021-22) ఏసీడీపీ నిధులు ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సూచనలు పాటించాలని నిర్దేశించారు. ఏడాది లోపు ఆయా పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రధానంగా సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యల్పంగా నాలుగు పనులను రూ.1.30 కోట్ల నిధులకు ప్రతిపాదించారు. ఒక్కచోటా పనులు ఆరంభించలేదు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ నత్తనడకన సాగుతున్నాయి.
* ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు నెలల క్రితం నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున ఏసీడీపీ నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి 30 పనులకు రూ.1.33 కోట్లు, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి 40 పనులకు రూ.2.97 కోట్లు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు 24 పనులకు రూ.1.20 కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రతిపాదించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.
క్షేత్ర స్థాయి పరిస్థితి..
* అందోలు మండలంలో 80 పనులకు రూ.4.80 కోట్ల నిధులను ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మంజూరు చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గుత్తేదారు నిర్లక్ష్యం వల్ల ఎర్రారం, మన్సానిపల్లిలోని సీసీ రహదారులు కమ్యూనిటీ హాలు మినహా మిగతా పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది.
* నారాయణఖేడ్ మండలంలో 70 శాతం వివిధ సామాజిక భవనాలకు కేటాయించారు. చాలా చోట్ల పనులు ఆరంభించాల్సి ఉంది.
* పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం కానుకుంట, రాంరెడ్డిబావిలోనూ భవనాల పనుల్లో పురోగతి లేదు. జిన్నారం మండలంలో లక్ష్మీపతిగూడెం, రాళ్లకత్వ గ్రామ పంచాయతీ నిర్మాణాల పనులకు ఇటీవల శ్రీకారం చుట్టారు.
* జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి, మాచిరెడ్డిపల్లి, వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లి, మాద్రి, దిగ్వాల్, లాలాకుంట, బసంత్పూర్, విట్టునాయక్ తండా, ఖాన్జామల్పూర్లో తదితర గ్రామాలు, తండాల్లో రూ.5 లక్షల చొప్పున సామాజిక భవనాలు, షాదీఖానాలు, సీసీ రహదారులకు నిధులు కేటాయించారు. ఒక్క చోటైనా పనులు చేపట్టలేదు.
అధికారులు ఏమంటున్నారంటే..
జిల్లాలో ఏసీడీపీ నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేస్తామని జగదీశ్వర్ (పీఆర్ఈఈ) , మనోహర్ (సీపీవో) పేర్కొన్నారు. త్వరలో ఇంజినీరింగ్ అధికారులతో సమన్వయం కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. వచ్చే మార్చి 31లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ