చదువుతో పాటు దేశాభివృద్ధికి కృషి
ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు దేశాభివృద్ధికి పాటుపడాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (అభావిప) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జానారెడ్డి సూచించారు.
అభావిప రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జానారెడ్డి
మాట్లాడుతున్న జానారెడ్డి, వేదికపై శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు
మెదక్ టౌన్, న్యూస్టుడే: ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు దేశాభివృద్ధికి పాటుపడాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (అభావిప) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జానారెడ్డి సూచించారు. శనివారం మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు వేడుక మందిరంలో అభావిప 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ప్రపంచంలో అత్యధిక సభ్యులున్న ఏకైక విద్యార్థి సంఘం అభావిప అని పేర్కొన్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. గొప్ప చరిత్ర కలిగిన మన సంస్కృతి నాశనానికి పలు కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టే బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో దేశం ప్రపంచంలోనే పెద్దన్న పాత్రను పోషించే స్థాయికి చేరిందన్నారు. అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుండటంతో ఓర్వలేని వారు పలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. యువత మత్తుకు బానిసలు కాకుండా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించామని గుర్తుచేశారు. దేశం కోసం ఎంతమంది మహనీయులు ప్రాణాలను త్యాగం చేశారని, వారి స్ఫూర్తిగా ఆశయాల సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం 3 వేల మందితో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర కార్య సమితి సభ్యుడు శ్రీధర్, మెదక్ విభాగ్ కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోధన, బోధనేతర ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెదక్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు భానుచందర్, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు నవీన్, పట్టణాధ్యక్షుడు సంతోష్రెడ్డి, స్వాగత సమితి సభ్యుడు రాజశేఖర్, జిల్లా కన్వీనర్ శశికాంత్, రాష్ట్రకార్యవర్గ సభ్యురాలు ఆర్తి, సమ్మేళనాల జిల్లా కన్వీనర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను భాజపా అమ్మేస్తోంది: సీఎం రేవంత్రెడ్డి
[ 26-04-2024]
సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!