logo

ఇంట్లో సంతోషం.. అంతలోనే విషాదం

అప్పటివరకు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. ఇక వారికి బైబై చెప్పి బయల్దేరాడు. ఇంతలో మార్గమధ్యలో కారు రూపంలో వచ్చిన మృత్యువు బలితీసుకుంది.

Published : 06 Feb 2023 01:45 IST

కారు, ద్విచక్ర వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

కొల్చారం, మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: అప్పటివరకు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. ఇక వారికి బైబై చెప్పి బయల్దేరాడు. ఇంతలో మార్గమధ్యలో కారు రూపంలో వచ్చిన మృత్యువు బలితీసుకుంది. కొల్చారం ఏఎస్‌ఐ తారాసింగ్‌ తెలిపిన వివరాలు.. హవేలిఘనపూర్‌ మండలం జక్కన్నపేటకు చెందిన బి.నాగరాజు (38) హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ఒకటో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు. అనంతరం తన వాహనంపై హైదరాబాద్‌కు బయల్దేరాడు. కొల్చారం గ్రామ శివారులో మలుపు వద్ద మెదక్‌-నర్సాపూర్‌ జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో నాగరాజు కింద పడగా తలకు తీవ్రగాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడికి భార్య కవిత, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. నాగరాజు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఏఎస్‌ఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని