అనధికార కోతలు.. రైతుకు వ్యథలు
జిల్లాలో అనధికార విద్యుత్తు కోతలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగుకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో యాసంగిలో రైతులు పంటలు వేశారు.
రోడెక్కి నిరసన తెలుపుతున్న వైనం
న్యూస్టుడే, సిద్దిపేట అర్బన్, నంగునూరు, చేర్యాల, బెజ్జంకి, కోహెడ
విద్యుత్తు కోసం చేర్యాలలో పొలం గట్టుపైనే నిద్రిస్తున్న రైతు
జిల్లాలో అనధికార విద్యుత్తు కోతలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగుకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో యాసంగిలో రైతులు పంటలు వేశారు. తీరా అనధికారికంగా కోతలు పెడుతుండటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నాలుగైదు రోజులుగా సరఫరాలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రసుత్తం రాత్రి 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అధిక లోడు కారణంగా మధ్యలో గంట, రెండు గంటలపాటు అనధికార కోతలు విధిస్తున్నారు. గృహ, వాణిజ్య, వ్యాపార సముదాయాలకు యథావిధిగా సరఫరా చేస్తున్నారు. విద్యుత్తు సమస్యకు తోడు మొగిలి పురుగులతో పంటలకు నష్టం వాటిల్లనుందని రైతులు అంటున్నారు.
పెరుగుతున్న వినియోగం..
జిల్లావ్యాప్తంగా 5.25 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో 1.54 లక్షలు వ్యవసాయానివే. జిల్లాలో 3 లక్షల ఎకరాలకుపైగా వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కూరగాయలు సాగు చేశారు. రోజువారీగా 7.6 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతోంది. కొన్ని రోజులుగా వాడకం ఎక్కువైంది. వ్యవసాయం, గృహ, వ్యాపార, పరిశ్రమలకూ వినియోగం ఎక్కువ కావడంతో లోడ్ తగ్గించేందుకు అధికారులు అనధికార కోతలు విధిస్తున్నారు. మూణ్నాలుగు రోజులుగా మధ్యాహ్నం వేళ ఇబ్బందులు తప్పడం లేదు.
అధిక నీరు అవసరం...
యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, కూరగాయ పంటలకు ప్రస్తుతం అధిక నీరు అవసరమవుతోంది. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు చివరి దశలో ఉన్నాయి. రెండ్రోజులుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్ర వరకు కోత విధిస్తున్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పలుచోట్ల విద్యుత్తు సరఫరా ఇలా..
* బెజ్జంకి మండలంలో 7న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6.40 వరకు, తిరిగి రాత్రి 10 నుంచి 8వ తేదీ వేకువజామున 4 గంటల వరకు, తిరిగి ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా చేశారు.
* సిద్దిపేట గ్రామీణం, నారాయణరావుపేట, నంగునూరు మండలంలో 6వ తేదీ రాత్రి 10.15 నుంచి 7వ తేదీ ఉదయం 11.20 గంటల వరకు, తిరిగి రాత్రి 10.15 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నిరంతరాయంగా వ్యవసాయానికి సరఫరా చేశారు.
* కోహెడ మండలంలో ఈనెల 6న రాత్రి 10 గంటల నుంచి 7న ఉదయం 5 వరకు, తిరిగి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు 8న ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరా చేశారు.
సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రంలో సమస్య..
- మహేష్కుమార్, ఇన్ఛార్జి ఎస్ఈ సిద్దిపేట
సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రంలో రెండు జనరేటర్లలో సాంకేతిక సమస్య ఉత్పన్నమవడంతో సరఫరా నిలిచిపోయింది. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో జిల్లాలో వ్యవసాయానికి రెండ్రోజులుగా రాత్రి 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సరఫరా చేశాం. మిగిలిన సమయంలో కోత విధించాం. గృహ, వాణిజ్య, వ్యాపార సముదాయాలకు యథావిధిగా విద్యుత్తు సరఫరా అవుతోంది. సింగరేణిలో నెలకొన్న సమస్య పరిష్కారమైతే సరఫరాను పునరుద్ధరిస్తాం.
కనీసం 9 గంటలు ఇవ్వాలి..
- కిష్టయ్య, చుంచనకోట చేర్యాల మండలం
మూడెకరాల్లో వరి సాగు చేశా. ప్రస్తుతం నీటి తడులు సరిగానే అందుతున్నాయి. గతంలో రాత్రి, పగలు కలుపుకొని 9 గంటలపాటు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా అయ్యేది. రెండ్రోజులుగా పగలు అడపాదడపా గంట మాత్రమే కరెంటు వస్తోంది. రాత్రివేళ 5 గంటలు ఇస్తున్నారు. నీటి తడులు సరిగా అందక పొలం ఆరిపోతోంది. ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో పాతిక శాతం పొలం నెర్రెలువారుతుంది. రోజుకు కనీసం 9 గంటలు సరఫరా చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ఇచ్చిన సంస్థలను భాజపా అమ్మేస్తోంది: సీఎం రేవంత్రెడ్డి
[ 26-04-2024]
సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేట్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. -
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!