కొరవడిన నిర్వహణ.. నీటికి వేదన
ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పరిష్కారం చూపింది. ఇందుకోసం ప్రతి గ్రామంలో ట్యాంకు నిర్మించి, పైప్లైన్ వేసి, కుళాయిలను బిగించారు.
పల్లెల్లో ఇదీ తీరు
- న్యూస్టుడే, మెదక్, నర్సాపూర్, పాపన్నపేట, అల్లాదుర్గం, రేగోడ్
ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పరిష్కారం చూపింది. ఇందుకోసం ప్రతి గ్రామంలో ట్యాంకు నిర్మించి, పైప్లైన్ వేసి, కుళాయిలను బిగించారు. అయినా ఇంకా పల్లెల్లో ఎద్దడి నెలకొంది. లీకేజీలతో సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాలో ఎదురవుతున్న ఇబ్బందులను ‘న్యూస్టుడే’ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలు ఇలా..
జిల్లాకు సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వద్ద మిషన్ భగీరథలో రూ.857.42 కోట్లు వెచ్చించి, ఫిల్టర్బెడ్ నిర్మించారు. అయితే తరుచూ సాంకేతిక సమస్యలతో తలెత్తుతున్నాయి. చక్రియాల ఇన్టెక్వెల్ వద్ద విద్యుత్తు సమస్యతో నర్సాపూర్ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు రెండూ, మూడు రోజుల పాటు సరఫరా నిలిపివేస్తున్నారు.
ట్యాంకు నిరుపయోగం : నర్సాపూర్ మండలం జగ్యాతండాలో ట్యాంకు వృథాగా ఉంది. దీనిని వినియోగంలోకి తీసుకువస్తే విద్యుత్తు, సాంకేతిక సమస్యలు తలెత్తితే వినియోగించుకోవచ్చు. దీని పక్కనే ఉన్న బోరు నుంచి ట్యాంకుకు కనెక్షన్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. మంజీరా సరఫరా నిలిచిపోయినప్పుడు వ్యవసాయ బోర్లే దిక్కవుతున్నాయి.
మరమ్మతుకు నోచక : శివ్వంపేట మండలం నానుతండాకు సాంకేతిక కారణాలతో మంజీరా నీరు నిలిచిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న మూడు బోర్లే ఆధారమయ్యాయి. అయితే వీటిలో రెండు పనిచేయడంలేదు. కొల్చారం, కౌడిపల్లి, వెల్దుర్తి మండలాల్లో మంజీరా నీటి సరఫరా లేని సమయాల్లో అవస్థలు తప్పడంలేదు. ఈ విషయమై డీఈఈ కిషన్ మాట్లాడుతూ.. మంజీరా సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. టేక్మాల్ మండలం వెంకటాపూర్లో ఒకే ట్యాంకు ద్వారా సరఫరా చేయడంతో సరిపోవడం లేదు. గతంలో నిర్మించిన ట్యాంకు ఉపయోగంలో లేదు. మరమ్మతు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
పగిలిన పైపులైన్లు : పాపన్నపేట మండలం డాక్య, రాజ్య, అమ్రియా తండాలకు నీటి సరఫరా కావడంలేదు. అధికారులకు విన్నవించినా, స్పందించడం లేదని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. పాపన్నపేట, కొడపాక, కొత్తపల్లి గ్రామాల్లోని పలు కాలనీల్లో సరిపోను రావడంలేదని వాపోతున్నారు. కొన్ని చోట్ల పైపులైన్లు పగిలాయి. మరమ్మతు చేపట్టడంలేదు.
రేగోడ్ మండలం పోచారంలో సరఫరా అయిన కలుషిత నీరు
అల్లాదుర్గం మండలం రాంపూర్లో లీకేజీ
బోర్లే దిక్కు : అల్లాదుర్గం మండలం రాంపూర్ శివారు పెద్దమ్మ ఆలయ సమీపంలో పైపులు లీకై నీళ్లు నిలుస్తున్నాయి. దీంతో కలుషితమవుతున్నాయి. మండలంలోని వెంకటారావుపేట్లో బోరు బావుల వద్దకు వెళ్తున్నారు. పెద్దశంకరంపేట తిరుమలపురం కాలనీ, అంబేడ్కర్ చౌక్ వద్ద ఇదే పరిస్థితి. రేగోడ్ మండలం పోచారంలోనూ పదిహేనురోజులుగా ఇదే పరిస్థితి ఉన్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం
సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిసరఫరా అవుతోంది. కలుషితమయ్యేందుకు ఆస్కారం లేదు. సమస్యలున్నా, లీకేజీ గురించి తెలిసినా వెంటనే పరిష్కరిస్తున్నాం. చక్రియాల్ ఉపకేంద్రం నుంచి పరిశ్రమలకు కనెక్షన్లు ఉండడం వల్ల లోడు పెరిగి విద్యుత్తు నిలిచిపోతోంది. ప్రత్యేక హెచ్టీ లైన్ వేయనున్నాం.
దినేశ్, కిషన్, డీఈఈలు, మిషన్ భగీరథ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా