చకచకా నిర్మాణం.. ప్రమాదాలు దూరం
జాతీయ రహదారిపై బైపాస్ వలయం.. రయ్మంటూ దూసుకొచ్చే వాహనాలు.. రెప్పపాటులో ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోవడం.. ఇలా నెలలో ఐదారు ప్రమాదాలు జరిగేవి.
న్యూస్టుడే, చేగుంట
ఆరు వరుసలుగా జాతీయ రహదారి నిర్మాణం
జాతీయ రహదారిపై బైపాస్ వలయం.. రయ్మంటూ దూసుకొచ్చే వాహనాలు.. రెప్పపాటులో ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోవడం.. ఇలా నెలలో ఐదారు ప్రమాదాలు జరిగేవి. ఇది 44వ జాతీయ రహదారిపై చేగుంట సమీపంలోని రెడ్డిపల్లి బైపాస్ సర్కిల్ వద్ద పరిస్థితి. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అక్కడ ఉపరితల వంతెన నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న అతిపొడవైన 44వ జాతీయ రహదారి జిల్లాలోని చేగుంట, తూప్రాన్ మీదుగా వెళ్తుంది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఈ దారిలో వేగంగా వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. స్పీడ్గన్లు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యమే. ముఖ్యంగా రెడ్డిపల్లి సర్కిల్ వద్ద ఘటనలు ఎక్కువగా జరుగుతుండేవి. ఇటు హైదరాబాద్, అటు నాగపూర్ నుంచి వచ్చే వాహనాలు సమీపంలోకి వచ్చే వరకు బైపాస్ సర్కిల్ కనిపించకుండా ఉండటంతో డ్రైవర్లు తికమకపడేవారు. ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం.
రూ.19 కోట్లతో..
రెడ్డిపల్లి వద్ద ప్రమాదాల నివారణకు ఉపరితల వంతెన నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.19 కోట్లు మంజూరు చేసింది. వీటితో గతేడాది నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. ఇరువైపులా మట్టి వేస్తూ రహదారి నిర్మాణం చేపడుతున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ ఆరు వరుసలుగా నిర్మిస్తున్నారు. మరో ఆరు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికతో సాగుతున్నారు.
తగ్గిన వంతెన ఎత్తు
వాస్తవానికి వంతెన ఎత్తు 18 అడుగులు ఉండాలి. ఇక్కడ మాత్రం 13 అడుగులు మాత్రమే ఉంది. అందులో నుంచి భారీ వాహనాలు రాకపోకలు సాగించడం కష్టంగా ఉంటుంది. కేవలం బస్సులు, లారీలు మాత్రమే వెళ్లేందుకు ఆస్కారం ఉంది. తూప్రాన్ మండలం నాగులపల్లి వద్ద వంతెన ఎత్తు 18 అడుగులు ఉంది. నాగపూర్ వైపు నుంచి చేగుంటకు భారీ వాహనాలు రావాలంటే కుదరదు. ఈ విషయమై స్థానికులు విన్నవిస్తున్నా ఎన్హెచ్ఏఐ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిజామాబాద్ నుంచి చేగుంటలోకి వాహనాలు మలుపు తిరిగే చోట సర్వీసు రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇలా కొన్ని సవరణలు చేస్తూ నిర్మాణం చేపడితే ప్రయాణం సాఫీగా సాగిపోనుంది. దీనిపై సంబంధిత అధికారులు దృష్టిసారించాలి.
చేగుంట వద్ద నిర్మిస్తున్న వంతెన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం
[ 10-05-2024]
చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ యాదవ సంఘం సభ్యులు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 10-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. -
వేగులు.. నేతలకు గుబులు
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్నారు. -
రూ.లక్ష వేతనం.. వైద్యసేవలు ఉచితం
[ 10-05-2024]
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
ఓటు పవిత్రమైనది
[ 10-05-2024]
ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. -
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
[ 10-05-2024]
‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. -
మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు
[ 10-05-2024]
కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. -
12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
[ 10-05-2024]
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి
[ 10-05-2024]
ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు
[ 10-05-2024]
మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 10-05-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
-
‘పది’లో 625/625 మార్కులు.. అదరగొట్టావ్ అంకిత!