స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు.
న్యూస్టుడే, చేగుంట: లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. ముఖ్యమైన కేంద్రస్థానం ఎంపిక చేసుకొని రోడ్డుషో, కార్నర్ మీటింగ్లను ప్రస్తుత ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో, కాలనీలు, బస్తీల్లో ప్రచారమంతా స్థానిక నాయకుల భుజస్కంధాలపై ఆధారపడి ఉంది. మండల స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తామే అభ్యర్థులం అన్నంతగా బాధ్యత భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. మెదక్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భారాస, భాజపాలకు చెందిన నాయకులు తమ పార్టీ అభ్యర్థులకు గ్రామ స్థాయిలో అధిక ఓట్లు వచ్చేలా, పరపతి రుజువు పర్చుకునేలా నిరంతరం కృషి చేస్తున్నారు. ఇంటింటికీ కరపత్రాలు పంచడం, దుకాణాల్లోనూ తమ పార్టీ, అభ్యర్థులు ఇస్తున్న హామీలను వివరించడం చేస్తున్నారు. మెదక్లో కాంగ్రెస్ నుంచి నీలం మధు, భారాస తరఫున వెంకట్రామిరెడ్డి, భాజపా అభ్యర్థిగా మాధవనేని రఘునందన్రావు నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల రోడ్డుషో, కార్నర్ మీటింగ్లలో పాల్గొంటున్నారు. మండలాల్లో మాత్రం కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు ప్రచారంలో ఉంటున్నారు. ఓటర్లకు పార్టీ అభ్యర్థి పేరు, గుర్తు, పొటో తెలిసేలా నమూనా ఈవీఎంలను వెంటేసుకొని అవగాహన కల్పిస్తున్నారు. గ్రామానికి రెండేసి నమూనా ఈవీఎంలను పార్టీలు సరఫరా చేశాయి. రాబోయే సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహులు.. అనుచరులతో కలిసి ఇప్పటినుంచే ప్రాక్టీస్ మాదిరి సందడిగా ఊళ్లు, గల్లీలు తిరుగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే