బీడుభూముల్లో.. సాగునీళ్లు!
బీడుభూములకు సాగునీళ్లిచ్చేలా సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధి 11 మండలాలు, 231 గ్రామాలకు దీని ద్వారా ప్రయోజనం దక్కనుంది.
సంగమేశ్వర ఎత్తిపోతల నిర్మాణ పనులకు శ్రీకారం
నేడు భూమిపూజ చేయనున్న మంత్రి హరీశ్రావు
ఏర్పాట్ల గురించి తెలుసుకుంటున్న అదనపు పాలనాధికారి వీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే క్రాంతికిరణ్
ఈనాడు, సంగారెడ్డి: బీడుభూములకు సాగునీళ్లిచ్చేలా సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధి 11 మండలాలు, 231 గ్రామాలకు దీని ద్వారా ప్రయోజనం దక్కనుంది. 2.19 లక్షల ఎకరాలకు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం దీని ద్వారా ఎక్కువగా లబ్ధి పొందనుంది. దీని పరిధిలోని అయిదు మండలాల్లో 115 గ్రామాల్లోని 1.03లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. అందోలులోని రెండు మండలాల్లోని 66 గ్రామాల పరిధిలో 65,816 ఎకరాలకు, సంగారెడ్డి పరిధి నాలుగు మండలాల్లో 50గ్రామాల్లోని 49,925 ఎకరాలకు అందేలా పనులు చేయనున్నారు. ఈనెల 7న మంత్రి హరీశ్రావు మునిపల్లి మండలంలోని చిన్నచెల్మడ వద్ద నిర్మించిన పంపుహౌజ్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించనున్నారు. మరో పంపుహౌజ్ను జహీరాబాద్ మండలంలోని హోతి(కె) గ్రామంలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.2,653 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెడుతున్నారు. సాగునీటి దినోత్సవం సందర్భంగా నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత మంత్రి హరీశ్రావు అక్కడే ఏర్పాటు చేసే బహిరంగసభలో మాట్లాడనున్నారు. ఇప్పటికే అధికారులు ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈనెల 6న అదనపు పాలనాధికారి వీరారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, నీటిపారుదల శాఖల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు.
గోదావరి జలాలను సింగూరులో నింపి: కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ -6 ద్వారా కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయం నుంచి 12టీఎంసీల నీటిని సింగూరులో ఎత్తిపోస్తారు. దీనిని సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా మూడు నియోజకవర్గాలకు మళ్లిస్తారు. ఈ ప్రాజెక్టుకోసం 113మెగావాట్ల విద్యుత్తు వినియోగించాల్సి ఉంటుందని అంచనా. పంపుహౌజ్లు మొదలు కాలువల నిర్మాణానికి 6,727 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఈ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి సాగుకు నీళ్లివ్వాలనేది లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీని ఢీకొట్టిన కారు.. మంటలు చెలరేగి ఒకరు సజీవదహనం
[ 25-04-2024]
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగు రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. -
గ్రామ మణిపూసలు
[ 25-04-2024]
సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన జువేరియా నాజ్ బైపీసీ ద్వితీయ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించారు. -
కాస్త మెరుగు..
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాలు ఈసారి కాస్త ఊరటనిచ్చాయి. గత కొన్నేళ్లుగా అట్టడుగు స్థానంలో ఉంటున్న జిల్లా ఈసారి కాసింత మెరుగైన ఫలితాలు సాధించింది. -
ఓటర్లు అధికం..ఆకట్టుకునేందుకు వ్యూహం
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో సర్వశక్తులొడ్డి మెదక్ స్థానాన్ని కైవసం చేసుకుతీరాలని అన్ని పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు -
సందడిగా నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి నామినేషన్ల జోరు కొనసాగుతోంది. బుధవారం భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారి రాహుల్రాజ్కు అందజేశారు. -
విద్యా వికాసానికి పీఎంశ్రీ
[ 25-04-2024]
పాఠశాలలకు నిధులు లేకపోవడంతో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నప్పటికీ విద్యార్థులు చదువుకునేందుకు గదుల కొరత, తాగేందుకు నీటి సౌకర్యం ఉండదు. -
ఆనవాయితీ కొనసాగింపు..
[ 25-04-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ స్థానం నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలు హ్యాట్రిక్ లేదంటే రెండు సార్ల చొప్పున విజయాలు సాధించడం విశేషం. -
తెలంగాణ వయా కర్ణాటక
[ 25-04-2024]
జహీరాబాద్.. 1956 నవంబరు 1 వరకు హైదరాబాద్ రాష్ట్రంలోనే కొనసాగింది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని కొన్ని పట్టణాలు, గ్రామాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి పట్టణాలు అప్పటి ఆంధ్రప్రదేశ్లో విలీనమై ఉండేవి. -
కాంగ్రెస్లో చేరిన విగ్రాం శ్రీనివాస్గౌడ్
[ 25-04-2024]
పెద్దశంకరంపేటకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్ బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. -
మళ్లీ చోరీలు చేయాలని బెదించడంతో హత్య
[ 25-04-2024]
డబ్బుల విషయంలో కోహీర్లో మంగళవారం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మళ్లీ చోరీలు చేద్దాం, -
ఖర్చు మించితే.. అనర్హతే
[ 25-04-2024]
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకొని విజయం సాధించేందుకు శ్రమిస్తుంటారు. -
మళ్లీ వెనక బాటే !
[ 25-04-2024]
బీసీ గురుకులాల్లో 89.38 శాతం: మహత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో 292 మంది విద్యార్థులకు 261 మంది ఉత్తీర్ణులై 89.38 శాతం సాధించారు -
జహీరాబాద్కు 10 నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వల్లూరు క్రాంతికి అందజేశారు. -
లోక్సభ ఎన్నికల్లో భారాసదే విజయం
[ 25-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లోనూ భారాస విజయం ఖాయమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. -
భాజపా బహిరంగ సభకు సర్వం సిద్ధం
[ 25-04-2024]
సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు