నిబంధనల అమలు..అడుగడుగునా తనిఖీలు
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం నిఘాల ద్వారా అప్రమత్తంగా ఉంది.
కారులో పరిశీలిస్తున్న పోలీసులు
న్యూస్టుడే, సిద్దిపేట: ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం నిఘాల ద్వారా అప్రమత్తంగా ఉంది. మార్చి 16న సార్వత్రిక ఎన్నికల నగారా మోగగా మే 13న తెలంగాణలో పోలింగ్ తేదీగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ తనిఖీలు ముమ్మరం చేసింది. ప్రణాళికాబద్ధంగా చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో పెద్దమొత్తంలో నగదు, మద్యం, ఇతర వస్తువులు లభించాయి. తనిఖీల సందర్భంలో ఇతరత్రా నేరాలు వెలుగుచూస్తుండటం గమనార్హం. గంజాయి సరఫరా, రేషన్ బియ్యం అక్రమ రవాణా ఉదంతాలు బయటపడుతున్నాయి. జిల్లాలో ఎనిమిది గంజాయి కేసులు నమోదవగా.. రూ.2.65 లక్షల విలువైన 8.209 కిలోల మేర సరుకు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకొని 21 కేసులు నమోదు చేశారు. రూ.8.80 లక్షల విలువైన బియ్యాన్ని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించారు.
జిల్లాలో 26 పోలీసు ఠాణాల పరిధిలో 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇవి రోజులో 24 గంటల పాటు వాహనదారులపై నిఘా సారిస్తున్నాయి. అనుమానితులను జల్లెడ పడుతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు - 11, స్టాటిస్టికల్ సర్వెలెన్సు - 13, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బృందాలు - 26 కీలక భూమిక పోషిస్తున్నాయి. 1,009 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులోని 151 సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయాచోట్ల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తుంటే స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా కవాతు నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటికే సీఐఎస్ఎఫ్ కంపెనీకి చెందిన 80 మంది జిల్లాకు రాగా త్వరలో మరిన్ని కేంద్ర బలగాలు జిల్లాకు చేరనున్నాయి.
ఫిర్యాదు చేయండి: అనూరాధ, పోలీసు కమిషనర్
ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం. అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పిస్తాం. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూం చరవాణి నంబరు 87126 67100లో సంప్రదించాలి. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి. పార్టీ ఏదైనా ప్రచారం అడ్డుకోవద్దని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నం. 1950 లేదా సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి.
ఇప్పటివరకు నగదు స్వాధీనం - రూ.66.10 లక్షలు
మద్యం జప్తు - 1,209 లీటర్లు
మద్యం కేసులు - 113
విలువ - రూ.6.19 లక్షలు
పరిష్కరించిన నాన్బెయిలబుల్ వారెంట్లు - 121
బైండోవరు - 97
కేసుల్లో 101 మంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది. -
బరిలో 44 మంది 15 మంది
[ 30-04-2024]
మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. -
బడుల బాగుకు నిధులు
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. జిల్లాలో చాలా పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మెతుకుసీమలో త్రిముఖ పోరు
[ 30-04-2024]
మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది. -
స్వీప్ నడవడి.. చైతన్య ఒరవడి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం. -
భాజపా మళ్లీ వస్తే ప్రజల జీవితాలు ఆగం
[ 30-04-2024]
భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు. -
వేసవి శిబిరాలు.. విజ్ఞాన వీచికలు
[ 30-04-2024]
వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు. -
గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి
[ 30-04-2024]
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. -
అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే!
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
పరిశ్రమల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
[ 30-04-2024]
జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాల వల్ల పలువురు కార్మికులు మరణిస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని జడ్పీ ఉపాధ్యక్షుడు, మరికొందరు జడ్పీ అభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మూడు నెలల్లో 5 గ్యారంటీల అమలు’
[ 30-04-2024]
కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ను భారీ అధిక్యంతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు
-
నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?: నెటిజన్కు హీరోయిన్ ఘాటు రిప్లై