నియోజకవర్గ ఇన్ఛార్జులెవరో?
దృష్టి సారించిన భాజపా నేతలు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్: జిల్లాలో భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జులు కొందరు పార్టీ మారడంతో కొత్తవారి నియామకంపై దృష్టి సారించారు. సంగారెడ్డి నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జి, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పులిమామిడి రాజు ఇటీవల హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే. దీంతో ప్రస్తుత లోక్సభ ఎన్నికల వేళ భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సదాశివపేటలో భారాస నుంచి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో భారాస నుంచి సంగారెడ్డి టికెట్ ఆశించారు. దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు. అప్పటికే భాజపా అధిష్ఠానం సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్రావు దేశ్పాండేకు టికెట్ ప్రకటించింది. అనూహ్యంగా బీఫాం పులిమామిడి రాజుకు ఇవ్వడంతో అప్పట్లో రాజకీయ దూమారం రేపింది. ఈ వ్యవహారంపై మనస్తాపం చెందిన రాజేశ్వర్రావు దేశ్పాండే భాజపాను తీవ్రంగా విమర్శించి భారాసలో చేరారు. రాజు గత శాసన సభ ఎన్నికల్లో 20,921 ఓట్లు సాధించారు. ఆయనకే సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. భాజపా చేపట్టిన పలు కార్యక్రమాలల్లో కీలకంగా పని చేస్తూ వచ్చారు. లోక్సభ ఎన్నికల వేళ... కీలక సమయంలో పులిమామిడి రాజు పార్టీని వీడటాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వరుసగా నియోజకవర్గ ఇన్ఛార్జులు పార్టీలు మారడంతో మళ్లీ ఎవరికి ఆ పదవి దక్కుతుందో వేచి చూడాల్సిందే.
మిగతా చోట్ల.. అందోలు నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జి బాబూమోహన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం భాజపాకు రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. జహీరాబాద్లో గత ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జి రామచందర్రావు ఇటీవల భాజపాకు రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భాజపా సమర్థులను నియోజకవర్గ ఇన్ఛార్జులుగా నియమిస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది. -
బరిలో 44 మంది 15 మంది
[ 30-04-2024]
మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. -
బడుల బాగుకు నిధులు
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. జిల్లాలో చాలా పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మెతుకుసీమలో త్రిముఖ పోరు
[ 30-04-2024]
మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది. -
స్వీప్ నడవడి.. చైతన్య ఒరవడి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం. -
భాజపా మళ్లీ వస్తే ప్రజల జీవితాలు ఆగం
[ 30-04-2024]
భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు. -
వేసవి శిబిరాలు.. విజ్ఞాన వీచికలు
[ 30-04-2024]
వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు. -
గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి
[ 30-04-2024]
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. -
అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే!
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
పరిశ్రమల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
[ 30-04-2024]
జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాల వల్ల పలువురు కార్మికులు మరణిస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని జడ్పీ ఉపాధ్యక్షుడు, మరికొందరు జడ్పీ అభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మూడు నెలల్లో 5 గ్యారంటీల అమలు’
[ 30-04-2024]
కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ను భారీ అధిక్యంతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి