ఉల్లంఘనలపై డేగకళ్ల నిఘా
ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం
వాహనాన్ని తనిఖీ చేస్తున్న పోలీసులు
న్యూస్టుడే, గజ్వేల్ గ్రామీణ: ఎన్నికల నిర్వహణలో నిఘా వ్యవస్థ ఎంతో ప్రధానం. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటిస్తున్నారా లేదంటే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారా అని పర్యవేక్షించడం కీలకం. ఇందుకు ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసీసీ, వీడియో సర్వే లెన్స్, స్టాటిస్టిక్ సర్వేలెన్స్, వీడియో ఫ్యూయింగ్, మీడియా కోఆర్డినేషన్ మానిటరింగ్, అకౌంటింగ్ బృందాలను ఎన్నికల సంఘం నియమించింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నిబంధనలు విస్మరించి తరలిస్తున్న నగదును ఈ తనిఖీ బృందాలు పట్టుకున్నాయి. అభ్యర్థులు, వారి అనుచరులపై ప్రత్యేక నిఘాసారించాయి. ప్రచారం తీరు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారా.. ఇలా కోణాలపై దృష్టి సారించడం గమనార్హం.
ఫ్లయింగ్ స్క్వాడ్.. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని 15 నియోజకవర్గాలకు ఒక్కో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ముఖ్యశాఖ అధికారి, ఒక పోలీస్ అధికారి, వీడియో గ్రాఫర్ ఉంటారు. ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారా, ప్రలోభాలకు గురి చేస్తున్నారా అని పర్యవేక్షిస్తారు. వీటికి సంబంధించి వీడియో తీసి రిటర్నింగ్ అధికారులకు నివేదిస్తారు.
వీడియో సర్వేలెెన్స్.. ప్రతి నియోజకవర్గానికి రెండు వీడియో సర్వేలెన్స్ బృందాలను నియమించారు. రెవెన్యూ పోలీస్ అధికారులతో పాటు వీడియోగ్రాఫర్ ఉన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలపై దృష్టిసారిస్తున్నారు. ప్రతి అంశాన్ని క్లుప్తంగా చిత్రీకరిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారు.
వీడియో ఫ్యూయింగ్.. వీడియో సర్వేలెన్స్ బృందాలు తీసిన వీడియోలను నిశితంగా పరిశీలించడమే వీడియో ఫ్యూయింగ్ సభ్యుల ప్రధాన విధి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున పని చేస్తోంది. ఇందులో ఒక గెజిటెడ్ అధికారితో పాటు ఇద్దరు సహాయకులు ఉన్నారు. ఉల్లంఘనలు గుర్తించి రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్తారు.
మీడియా కోఆర్డినేషన్ మానిటరింగ్.. మీడియా కోఆర్డినేషన్ మానిటరింగ్ బృందం రోజువారీగా దినపత్రికల్లో వచ్చే ప్రకటనలు, పార్టీలు, అభ్యర్థులు చేసే ఖర్చులను పక్కాగా లెక్క కడుతుంది. ఈ వివరాలను రిజిస్టర్లో నమోదుచేసి నిత్యం రిటర్నింగ్ అధికారికి నివేదిస్తుంది.
అకౌంటింగ్.. నియోజకవర్గానికి ఒక అకౌంటింగ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ట్రెజరీ లేదా బ్యాంక్ అధికారి బృంద సభ్యుడిగా ఉన్నారు. ఇతర శాఖకు చెందిన ఒకరు సహాయ అధికారిగా పని చేస్తారు. అభ్యర్థుల ఖర్చులను లెక్క కడుతుంది. రోజువారి లెక్కలను రిటర్నింగ్ అధికారికి అందజేస్తారు.
ఎంసీసీ.. ప్రతి మండలానికి ఒక మోడల్ కండక్ట్ బృందాన్ని(ఎంసీసీ) నియమించారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇవి పని చేస్తున్నాయి గెజిటెడ్ అధికారి నేతృత్వంలో పోలీస్ అధికారి, వీడియో గ్రాఫర్ పని చేస్తారు. అభ్యర్థుల ప్రచారాలు, ఖర్చులపై నిఘా సారించారు. అన్ని వివరాలను రిటర్నింగ్ అధికారికి తెలియజేస్తున్నారు.
స్టాటిస్టిక్ సర్వేలెన్స్.. డిప్యూటీ తహసీల్దారు ఆధ్వర్యంలో ఈ బృందం అక్రమాలపై ప్రత్యేక దృష్టిసారిస్తుంది. ఇందులో 8 మంది ఉంటారు. నలుగురు పోలీస్, ఓ అటవీ శాఖ, ఆబ్కారీ శాఖ అధికారులతో పాటు వీడియోగ్రాఫర్ ఉంటారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు స్టాటిస్టిక్ సర్వేలెన్సు బృందాల చొప్పున కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్తో దేశం సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ
[ 30-04-2024]
భారత్ను కాంగ్రెస్ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. -
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు భాజపా ప్రత్యేక వ్యూహం రూపొందించి అమలు చేస్తోంది. -
బరిలో 44 మంది 15 మంది
[ 30-04-2024]
మెదక్ లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. కీలకమైన సంగ్రామంలో 44 మంది అభ్యర్థులు తలపడనున్నారు. -
బడుల బాగుకు నిధులు
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. జిల్లాలో చాలా పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మెతుకుసీమలో త్రిముఖ పోరు
[ 30-04-2024]
మెతుకుసీమ పోరాటాల గడ్డ. దేశ ప్రధాని, ముఖ్యమంత్రిని అందించిన నేల ఇది. 19వ సారి లోక్సభ ఎన్నికలకు(ఉప ఎన్నికతో) సన్నద్ధమవుతోంది. -
స్వీప్ నడవడి.. చైతన్య ఒరవడి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య పరిరక్షణలో ‘ఓటు’ పాత్ర అనిర్వచనీయం. పారదర్శకమైన పాలన సాకారం కావాలంటే.. ఒకవేళ ఎన్నికైన తరువాత నిలదీసే హక్కు పొందాలంటే.. ఓటు సద్వినియోగంతోనే సాధ్యం. -
భాజపా మళ్లీ వస్తే ప్రజల జీవితాలు ఆగం
[ 30-04-2024]
భాజపా అధికారం చేపట్టిన పదేళ్లలో దేశంలో అసమానతలు పెరిగాయని ఆచార్య కోదండరాం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సోమవారం తెలంగాణ ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ పరిరక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవితాలు ఆగమవుతాయన్నారు. -
వేసవి శిబిరాలు.. విజ్ఞాన వీచికలు
[ 30-04-2024]
వేసవి సెలవులంటే.. చుట్టాల ఇళ్లు, విహారయాత్రలకు వెళ్లడం పరిపాటే. కొందరు ప్లిలలు మాత్రం విజ్ఞానం, నైపుణ్య అంశాలను పెంచుకోవాలని పరితపిస్తుంటారు. -
గతంలో తండ్రి.. ఇప్పుడు తల్లి
[ 30-04-2024]
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కొడుకే తల్లిదండ్రులను పొట్టనబెట్టుకున్నాడు. -
అభ్యర్థులు వీరే..ఇక ప్రచార హోరే!
[ 30-04-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానానికి బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
పరిశ్రమల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?
[ 30-04-2024]
జిల్లాలోని పరిశ్రమల్లో ప్రమాదాల వల్ల పలువురు కార్మికులు మరణిస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని జడ్పీ ఉపాధ్యక్షుడు, మరికొందరు జడ్పీ అభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘మూడు నెలల్లో 5 గ్యారంటీల అమలు’
[ 30-04-2024]
కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ను భారీ అధిక్యంతో గెలిపించాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..