ప్రవాసులు వేలల్లో.. నమోదు వందల్లో
ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం.
అమెరికాలో బతుకమ్మ సంబరాల్లో జిల్లా వాసులు(పాతచిత్రం)
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: ఇక్కడే పుట్టారు.. చదివింది ఇక్కడే. ఉద్యోగం, ఉపాధి కోసం వెళ్లి ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరిని ప్రవాస భారతీయులుగా పిలుస్తాం. ప్రవాసులు ఇక్కడ ఓటరుగా నమోదయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఓటింగ్లో పాల్గొని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు వీలుంటుంది. ప్రజాస్వామ్య పటిష్ఠంలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కొంతమంది మాత్రమే వినియోగించుకున్నారు.
దరఖాస్తుకు అవకాశం ఉన్నా..
జిల్లాలో ప్రవాసుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఓటరు జాబితాలో నమోదవుతున్న వారు మాత్రం వందల్లోనే. వీరు కూడా ఇక్కడ ఉన్నప్పుడు నమోదు చేసుకున్నవారే. విదేశాల్లో ఉంటున్నవారిలో ఎవరూ నమోదుకు ముందుకు రావడం లేదు. ఆన్లైన్లో ఫారం 6 ద్వారా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా సరిపోతుంది. అధికారులు పరిశీలించి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తారు. జిల్లా నుంచి కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఎక్కువగా వెళుతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ అక్కడ జీవనోపాధి సాగిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే ఉద్యోగాలు సాధించిన వారూ ఉన్నారు. జిల్లాలో కుటుంబీకులు, బంధువుల ఇళ్ల వద్ద శుభ కార్యాలు, పండగలు, సెలవుల సమయాల్లో ఇక్కడికి వస్తుంటారు. విదేశాల్లో ఉంటున్న వారి సంఖ్య 3వేలకు పైగా ఉండగా ఓటరు జాబితాలో మాత్రం 103 మందే ఉన్నారు. ఇందులో పటాన్చెరు నియోజవర్గానికి చెందిన వారు అత్యధికంగా 78 మంది ఉండగా నారాయణఖేడ్కు చెందిన వారు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.
కారణాలు అనేకం..
ప్రవాసులు ఓటు వేయాలంటే స్వదేశానికి రావాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఓటు వేసే అవకాశం వీరికి కల్పించకపోవడమే దీనికి కారణం. పనిచేస్తున్న చోట అనుమతి తీసుకుని ఇక్కడికి వచ్చి ఓటు వేయాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేందుకు రానుపోను ఖర్చులు రూ.వేలల్లోనే ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఓటరుగా నమోదుకు, ఓటు వేసేందుకు ముందుకురాని పరిస్థితి. ఇక్కడి రాజకీయాలపై మాత్రం వారికి ఆసక్తి తగ్గడం లేదు. ఎన్నికల్లో తమ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇక్కడ ఉన్న తమవారితో మాట్లాడుతూ ఆరా తీస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచే ఓటు.. చైతన్యం చాటు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎనలేనిది. దాన్ని పొందడమే కాకుండా.. వినియోగించుకోవడం అత్యంత ప్రధానం. వంద శాతం ఓటింగ్ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి
[ 02-05-2024]
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు. -
గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 02-05-2024]
భాజపా అభ్యర్థి రఘునందన్రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు. -
వసతులు కొరవడి.. అన్నదాత అలజడి
[ 02-05-2024]
జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. -
ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి
[ 02-05-2024]
ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్కు మద్దతు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడారు. -
కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
[ 02-05-2024]
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో భవన -
అప్రమత్తతోనే ప్రశాంతం
[ 02-05-2024]
ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు. -
రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..
[ 02-05-2024]
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు. -
కేసీఆర్ మా ఫోన్లు ట్యాపింగ్ చేయించారు
[ 02-05-2024]
మల్లన్న సాగర్ నిర్వాసితులమైన తమ ఫోన్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని నిర్వాసితులు ఎండీ హయాతుద్దీన్, వై.శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ.. -
జొన్న రైతులకు బకాయిల బెంగ
[ 02-05-2024]
అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
మహిళా సంఘాలకు సీఎస్సీ కేంద్రాలు
[ 02-05-2024]
పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. -
7, 8 తేదీల్లో మాక్ పోలింగ్పై శిక్షణ
[ 02-05-2024]
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
ఓటమి భయంతోనే భాజపా ఆరోపణలు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా తక్కువ సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆరోపించారు. -
నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం
[ 02-05-2024]
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన దుర్గాప్రసాద్, సుబ్బారావు, రవి గౌడ్ ముఠాగా ఏర్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652