logo

ఊడొచ్చిన ట్రాక్టర్‌ టైరు ఢీకొని వివాహిత మృతి

ట్రాక్టర్‌ టైరు ఊడి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టిన ప్రమాదంలో వివాహిత మృతిచెందారు. ఈ ఘటన గురువారం సాయంత్రం భువనగిరి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ పరిధి రాయగిరి వద్ద చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 12 Aug 2022 06:08 IST

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: ట్రాక్టర్‌ టైరు ఊడి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టిన ప్రమాదంలో వివాహిత మృతిచెందారు. ఈ ఘటన గురువారం సాయంత్రం భువనగిరి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ పరిధి రాయగిరి వద్ద చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన మేకల శ్రీనివాస్‌, శిరీష (23) దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం. శ్రీనివాస్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. భార్యాభర్తలు ద్విచక్ర వాహనం(యాక్టివా)పై యాదగిరిగుట్టకు చెందిన తమ బంధువుల వివాహానికి హాజరై తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాయగిరి వద్ద చెరువును తిలకించేందుకు కాసేపు ఆగారు. తిరిగి బయలుదేరుతూ యూటర్న్‌ తీసుకుంటున్నారు. అదే సమయంలో రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ ముందు టైరు ఊడిపోయి డ్రైవింగ్‌ చేస్తున్న శిరీష ఛాతికి బలంగా తగలడంతో భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు. శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరినీ భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శిరీష మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాఘవేందర్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని