అల్లంతదూరంలో.. ఆశలు గల్లంతు
ఐటీ రంగంలో అనిశ్చితి కారణంగా..ఆయా సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు ఏడు వేల మందికి పైగా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం.
కోదాడ, న్యూస్టుడే: ఐటీ రంగంలో అనిశ్చితి కారణంగా..ఆయా సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సుమారు ఏడు వేల మందికి పైగా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం. కోదాడ నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం చేసేవారు. డిసెంబరు మొదటి వారంలో సదరు సంస్థ ఆ ఉద్యోగిని తొలగించడంతో అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారం మరో 60 రోజుల్లో ఉద్యోగం చూసుకోకపోతే స్వదేశానికి పయనమవ్వాల్సిందే. ఇప్పటికే 55 రోజులైందని, మరో అయిదు రోజుల లోపు ఉద్యోగం దొరక్కపోతే భారత్కు రావాల్సిందేనని సదరు ఉద్యోగి వాపోయారు. జిల్లాకు చెందిన మరో ఉద్యోగి కాలిఫోర్నియాలో నాలుగేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. వారం రోజుల క్రితం సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ఫిబ్రవరి నెలతో ముగుస్తుంది. మరో రెండు నెలల్లో వేరే ఉద్యోగం దొరక్కపోతే స్వదేశానికి రావాల్సిందే. ఈ ఏడాది చివరిలో అతడి వివాహం ఉంది. ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడంతో సదరు ఉద్యోగి అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం హెచ్-1 వీసాల మీద ఉద్యోగం చేస్తున్నవారికి ఉద్యోగం పోతే మరో ఉద్యోగం 60 రోజుల్లో వెతుక్కోవాలి. హెచ్-1 వీసా నిబంధనల ప్రకారం ఆ ఉద్యోగికి అక్కడ ఉండే అవకాశం లేదు. ప్రతి సంస్థలో ఉద్యోగులను తొలగించడంతో ఈ రెండు నెలల్లో మరో ఉద్యోగం దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ స్వదేశానికి వచ్చి మళ్లీ వెళ్లాలంటే అమెరికా వీసా రావాలంటే మరో ఏడాది పైగా వేచి ఉండాల్సిందే. కెనడా, లండన్, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం ఇప్పుడు ఇదే పరిస్థితి ఉందని ఓ ఎన్నారై తెలిపారు. 2001, 2008 సంవత్సరాల్లోనూ ఇలాగే ఉద్యోగాలు కోల్పోయారు. అప్పుడు భారతీయులు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని, అక్కడే ఉంటే ఖర్చులు భరించలేమని ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కన్సల్టెన్సీ ఉద్యోగులకు కొంత ఉపశమనం..
విదేశాల్లో కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగం చేసే వారికి ఈ ఆపద సమయంలో కొంతఉపశమనం లభించే అవకాశం ఉంది. ఆయా కన్సల్టెన్సీలు తమ పలుకుబడితో చిన్న సంస్థలోనైనా ఉద్యోగాలు చూపించే అవకాశం ఉంటుందని ఎన్నారైలు తెలిపారు.
గత ఇరవై ఏళ్లలో ఇది నాలుగోసారి
ఎన్నారై జలగం సుధీర్, కోదాడ
విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోవడం కొత్తేమీ కాదు. 20 ఏళ్లలో ఇది నాలుగోసారి. 2001లో నా ఉద్యోగం పోయింది. తర్వాత స్వదేశానికి వచ్చి, ఇక్కడే కొంత కాలం ఉద్యోగం చేశాను. పరిస్థితులు అనుకూలించడంతో మళ్లీ అమెరికా వెళ్లాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా