ఆకలేస్తోంది.. కావాలి అల్పాహారం
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలనే లక్ష్యంతో విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందుకు అనుగుణంగా నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
సూర్యాపేట, (మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్టుడే: పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలనే లక్ష్యంతో విద్యాశాఖ కృషి చేస్తోంది. ఇందుకు అనుగుణంగా నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కొనసాగుతున్నాయి. వేకువజామునే లేవడం, పాఠశాలలకు సిద్ధం కావడం.. సమయానికి చేరుకునే హడావుడిలో చాలా మంది విద్యార్థులు ఇంటి వద్ద ఏమీ తినకుండానే బయల్దేరుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మధ్యాహ్న భోజనం ఉంటుంది. సాయంత్రం ప్రత్యేక తరగతులు జరుగుతుండటంతో ఇంటికి వెళ్లేసరికి 6.30 గంటలు దాటుతోంది. ఇలా పొద్దంతా కేవలం మధ్యాహ్న భోజనంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఉదయం, సాయంత్రం బడుల్లో అల్పాహారం పంపిణీ లేకపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఫలితంగా చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోతున్నారు. జిల్లాలో 189 ప్రభుత్వ, ఎయిడెడ్, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల నుంచి 7,535 మంది విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికి జనవరి నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులు ఇంటి నుంచి టిఫిన్ బాక్సుల్లో అల్పాహారం తెచ్చుకొని ఉదయం ప్రార్థన తరువాత భుజిస్తున్నారు. ఇంటి నుంచి ఏమీ తెచ్చుకోలేని విద్యార్థులకు అల్పాహారం అందించడానికి విద్యాశాఖ అధికారులతోపాటు వివిధ సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.
దాతలు చేయూతనిస్తే ఉపయుక్తం
- పి.రిషిత, జడ్పీ(బాలుర) ఉన్నత పాఠశాల, సూర్యాపేట
ప్రత్యేక తరగతుల నేపథ్యంలో రోజూ ఉదయం 8.15 గంటల లోపు ఏమి తినకుండా బడికి వసున్నా. మధ్యాహ్న భోజనం పెట్టే వరకు ఖాళీ కడుపుతో ఉంటున్నా. దాతలు ముందుకు వచ్చి చేయూతనిస్తే ఉపయుక్తంగా ఉంటుంది.
చదువుపై దృష్టి సారించలేక పోతున్నా..
- పి.స్రవంతి, జడ్పీ ఉన్నత పాఠశాల, సూర్యాపేట
గతంలో కొంతమంది వ్యాపారులు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించే వారు. ఈసారి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఖాళీ కడుపుతో బడికి హాజరవుతున్నా. మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం 6 వరకు ఎలాంటి స్నాక్స్ అందించకపోవడంతో చదువుపై దృష్టి సారించలేకపోతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ