చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు షురూ..
చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గృహాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
నేడు వేకువజామున పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం
గర్భగుడిలో పశ్చిమ ముఖంగా దర్శనమిస్తున్న శివలింగం
నార్కట్పల్లి గ్రామీణం, న్యూస్టుడే: చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గృహాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం వేకువజామున 4 గంటలకు స్వామివారి కల్యాణం, మంగళవారం వేకువజామున 4 గంటలకు అగ్నిగుండాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు సుమారు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు హాజరై స్వామివారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. మంత్రి జి.జగదీశ్రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జైబోలో తెలంగాణ సినిమా దర్శకుడు ఎన్.శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై శనివారం వేడుకలను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పి.రామలింగేశ్వరశర్మ, ఈవో నవీన్కుమార్ పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. వేద పండితులు అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షతావధానిశాస్త్రి, నీలకంఠశావాచార్య ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణ, గణపతిపూజలు నిర్వహించారు. జ్వోతి వెలిగించి, కంకణధారణ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీవో జయచంద్రారెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, ఇన్ఛార్జి తహసీల్దార్ మురళీమోహన్, సర్పంచి మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ సభ్యుడు మేకల రాజిరెడ్డి, నాయకులు ఊశయ్య, కృష్ణ, చంద్రశేఖర్, అర్చకులు నాగరాజు శర్మ, సురేశ్ శర్మ, సతీశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
గణపతి పూజలో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి, జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్రెడ్డి,
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు, తదితరులు
భక్తులకు విస్తృత ఏర్పాట్లు: మంత్రి
చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశామని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారని పేర్కొన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ సహ ఇతర అన్ని శాఖల అధికారులు, సిబ్బంది గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
ఆలయ ప్రత్యేకతే వేరు..
శివరాత్రి వచ్చిందంటే శివాలయాల్లో హరహర మహాదేవా...శంభోశంకర నాదం మార్మోగుతోంది. కానీ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మాఘశుద్ధ సప్తమి (రథసప్తమి).. మొదలుకొని ద్వాదశి వరకు చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గృహాలయంలో విద్యుత్ దీపాల వెలుగు, భక్తుల శివనామ స్మరణతో మార్మోగుతోంది. ఈ మాసంలో క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించే జాతరకు అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవానికి సుమారు 2 లక్షల మంది భక్తులు హాజరవుతారనే అంచనాతో లడ్డూలు, పులిహోర ప్రసాదం అందుబాటులో ఉంచారు. ఇక్కడ స్వామి అమ్మవార్లకు కల్యాణం నిర్వహించే మండపం వద్ద ఇరువైపులా పనులు జరుగుతున్నందున ఆ ప్రాంతం కింది భాగంలో స్వామి వారి కల్యాణానికి ఏర్పాట్లు చేశారు.
12 నెలలూ జాతరే
ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి నెలా అమావాస్య రోజున రాత్రి సుమారు 70వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. దీంతో ఆ రోజున స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చన చేపడతారు. ఇలా 12 నెలల పాటు భక్తులు రావడంతో ఈ దేవాలయంలో 12 జాతరలు గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?