ఇంతింతై అల్లుకునేలా..!
తెలంగాణ ప్రాంతంలో మగ్గం వర్క్ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పురుషులు వస్తున్నారు. వివిధ రకాల డిజైన్లు రూపొందిస్తూ బొటిక్లలో వందలాది మంది ఇతర రాష్ట్రాల వారు ఉపాధి పొందుతున్నారు.
మహిళల స్వయం ఉపాధికి ఉచిత కుట్టుశిక్షణ
కేంద్ర ప్రభుత్వ పథకం కింద కుట్టుమిషన్ శిక్షణ పొందుతున్న మహిళలు (పాత చిత్రం)
మిర్యాలగూడ, న్యూస్టుడే: తెలంగాణ ప్రాంతంలో మగ్గం వర్క్ చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పురుషులు వస్తున్నారు. వివిధ రకాల డిజైన్లు రూపొందిస్తూ బొటిక్లలో వందలాది మంది ఇతర రాష్ట్రాల వారు ఉపాధి పొందుతున్నారు. దీనికి భిన్నంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల నిరుపేద మహిళలకు కుట్టుమిషన్ అత్యాధునిక ఎంబ్రాయిడరీ డిజైన్లలో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందేలా చూడాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహిళల పాలిట వరంగా మారనుంది. ప్రతి నియోజకవర్గంలో మొదటి దశలో మూడువేల మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 36 వేల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది.
* ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏడాదిలో కొంత కాలం మాత్రమే శిక్షణ ఇచ్చేవి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సామాజిక సేవ సంస్థల వారికి ఈ శిక్షణల బాధ్యతలు అప్పగించి జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించే వారు. కొవిడ్ కారణంగా ఈ శిక్షణలు తగ్గుముఖం పట్టగా.. శిక్షణలకు ప్రభుత్వ నిధుల కేటాయింపులు సైతం నిలిచి పోయాయి.
* కొవిడ్ అనంతరం పరిస్థితులు అనుకూలించటంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి సహకారంతో శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
కటింగ్లో శిక్షణ పొందుతున్న మహిళలు
* 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలను ఎంపిక చేసి శిక్షణలు ఇచ్చి ప్రతినెల సగటున రూ.17వేల వరకు ఒక్కొక్కరిపై ఖర్చుచేసి వారికి అధునాతన కుట్టుమిషన్లు సైతం అందజేయాలని నిర్ణయించారు. శిక్షణ పొందిన వారికి స్థానికంగా ప్రభుత్వ పాఠశాలల్లో సారూప్య దుస్తులు కుట్టే బాధ్యతలు అప్పగించటంతో పాటుగా గురుకులాలు, వసతిగృహాల విద్యార్థుల దుస్తులు కుట్టించనున్నారు.
* చురుకైన ప్రతిభ కనబరిచే వారికి డిజైనింగ్లో శిక్షణతో ఫ్యాషన్ దుస్తులు కుట్టేలా అవకాశాలు కల్పించనున్నారు. సొంతంగా డిజైనర్ దుస్తులు కుడితే వాటిని మార్కెటింగ్ చేసుకునేలా విక్రయశాలలు సైతం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
- కాళిందిని, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, నల్గొండ
శిక్షణ విషయమై ప్రభుత్వం నుంచి గైడులైన్స్ రావాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అనుమతితో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేస్తాం. మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ ఎంతో ఉపయోగ పడటంతో పాటుగా వారు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్