logo

ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నం

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన బట్టు సునీత ప్రజావాణిలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

Published : 21 Mar 2023 05:24 IST

ఒంటిపై పెట్రోల్‌ పోసుకున్న సునీతపై నీళ్లు పోస్తున్న పోలీసు సిబ్బంది

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన బట్టు సునీత ప్రజావాణిలో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. మిర్యాలగూడ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన సునీత మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీలో ఖాళీ స్థలం అద్దెకు తీసుకుని వినాయక విగ్రహాలు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. పక్కన ఇదే వ్యాపారం చేస్తున్న కేద్రి బాలస్వామి, మోతే సైదులు విగ్రహాల కొట్టం ఖాళీ చేసి తమకు ఇవ్వాలని తరచూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు తెలిపింది. మిర్యాలగూడ వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో జనవరి 22న ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించే ప్రజావాణికి తన కూతురుతో కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చి దరఖాస్తు ఇస్తూ తనకు చావే శరణ్యమని, వేధింపులు భరించలేక పోతున్నామని ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. స్పందించిన సిబ్బంది వెంటనే ఆమెను వారించి తీసుకెళ్లారు. శరీరంపై నీరు పోసారు. అనంతరం ప్రజావాణికి వచ్చిన కలెక్టర్‌తో ఆమె సమస్యను విని ఎస్పీకి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని