బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు.
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏటా జరుగుతున్న హత్యల్లో వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తలను హత్య చేయిస్తున్న వారి సంఖ్య 25 నుంచి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. ఇతర వ్యక్తులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తను హత్య చేసిన వారు జైలు జీవితం గడిపి తిరిగి సుఖంగా ఉన్న దాఖలాలు ఒక్కటి కూడా లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఏడాదిలో వివాహేతర సంబంధాలకు అడ్డు వస్తున్నాడని భర్తలను చంపిన భార్యల సంఖ్య 67 ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. లెక్కల్లోకి రానివారి సంఖ్య మరికొంత ఉంటుంది.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తని చంపిన భార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు (పాత చిత్రం)
ఘటనలు ఇలా..
కట్టంగూరు మండలం కలిమెర గ్రామానికి చెందిన ఓ వివాహిత భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండేది. కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. చివరకు కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయడానికి పూనుకుంది. దీనికి మంగళసూత్రాన్నే సుపారీగా కుదుర్చుకుంది. వారం రోజుల క్రితం నలుగురు కలిసి హత్యచేశారు. కటకటాల పాలయ్యారు. వారి ఇద్దరి పిల్లల భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి వెళ్లింది.
ఆరు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న యువకుడు తన సమీప బంధువును ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొంత కాలం సఖ్యతగా ఉన్నవారికి ఒక పాప, బాబు పుట్టారు. ఆర్ధికంగా భాగా స్థిరపడిన అతను వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో అతడి భార్య మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఒక రోజు భర్త ఇంట్లో ఉండగానే ప్రియుడిని పిలిచి ఇద్దరు కలిసి సుత్తితో కొట్టి భర్తను చంపేశారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఇద్దరిని జైలుకు పంపారు. ఇద్దరు పిల్లలు మాత్రం అనాథలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భయమే హత్యల వరకు దారి తీస్తుంది
- డా.శివరామకృష్ణ, మానసిక వైద్యుడు, నల్గొండ
ఒకరికి మించి ఎక్కువ మందితో శారీరక సంబంధం కొనసాగించడం ఎంత మాత్రం సరైంది కాదు. కొంత కాలం క్రితం వరకు పురుషులు మాత్రమే ఒకరికి మించి ఎక్కువ వివాహాలు చేసుకునేవారు. ఇప్పుడు అలాంటి వివాహాలు తగ్గి సాధ్యం కాని కోరికల వైపు వెళ్తున్నారు. విషయం బయట పడడంతో భయంతో హత్యల వరకు వెళ్తూ ఇరువురి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. పక్కదారి పట్టాలనే ఆలోచన వచ్చినవారు ఇంతకు ముందు ఇతరులకు జరిగిన ఘటనలు గుర్తు చేసుకుని తన జీవితం అలా కాకూడదనే ఆలోచనతో బయటకు రావాలి. భర్త, పిల్లలు కుటుంబం అనే విషయాలపై ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ మంచి లక్ష్యాల కోసం పోటీ పడుతుండాలి. నిత్యం యోగా, ధ్యానం, చేయడంతో పాటు మానసిక వైద్యులను సంప్రదించినట్లయితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు