ఆట కట్టించలేరా..?
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’...
తోటల్లో రహస్యంగా జూదం
పెన్పహాడ్ మండలం దూపహాడ్లోని ఓ మామిడి తోటలో జూదం ఆడుతున్న జూదరులు
సూర్యాపేట నేరవిభాగం, పెన్పహాడ్, న్యూస్టుడే: జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’ కథనంతో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లోని సరిహద్దు గ్రామాల్లో తోటలపై అక్కడి పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. దీంతో జూదం నిర్వాహకులు ఆట స్థావరాలను తాజాగా సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్పహాడ్ మండలానికి తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం జూదాన్ని నిషేధించినా.. ఏదో ఒకచోట స్థావరాలను ఏర్పాటు చేసుకొని రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులో భాగంగా పోలీసులు ఒకవైపు రాష్ట్ర సరిహద్దులతో పాటు జాతీయ రహదారులపై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. మరోవైపు కొందరు జూదరులు మాత్రం జిల్లా కేంద్రానికి సమీపంలోనే తోటల్లో రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు.
ఆన్లైన్లో డబ్బులు.. టోకెన్ల ద్వారా లావాదేవీలు..
లోక్సభ ఎన్నికల సందర్భంగా డబ్బు రవాణా సాధ్యం కాకపోవడంతో ఆన్లైన్లో చెల్లించి.. టోకెన్లు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో టోకెన్ విలువ కనీసం రూ.5 వేల నుంచి ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ టోకెన్ల సాయంతోనే వారు లావాదేవీలు పూర్తి చేస్తారు. గెలుపొందిన వారు టోకెన్లను తిరిగి చెల్లించి డబ్బులను ఆన్లైన్లోనే తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. పది రోజులుగా పెన్పహాడ్ మండల కేంద్రంతో పాటు దూపహాడ్ గ్రామ పరిధిలోని కొన్ని తోటల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఈ తంతు కొనసాగుతోందని సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట, హుజూర్నగర్, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల నుంచి రోజుకు సుమారు యాభై మంది జూదరులు(పంటర్లు) ఇక్కడికి క్షేమంగా చేరుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. సొంతంగా కాకుండా నిర్వాహకుల వాహనాల్లోనే అక్కడికి తరలిస్తున్నారు. రోజుకు రూ.కోట్లల్లో డబ్బు చేతులు మారుతున్నట్లు సమాచారం. దీనిపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను వివరణ కోరగా.. ‘పరిశీలించి గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం. సిబ్బందిని పంపి నిర్వాహకులను పట్టుకుంటామని’ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్