నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది.
మేళ్లచెరువులో.. అడుగంటిన నాగుల చెరువు
భానుపురి, మేళ్లచెరువు, న్యూస్టుడే: తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఏడాది 3,096 చెరువుల్లో 12.7 లక్షల చేపల పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదిలారు. అప్పట్లో 40 ఎం.ఎం. నుంచి 100 ఎం.ఎం వరకు పరిమాణం ఉన్న చేప పిల్లలు వదిలారు. ఇవి కిలో, రెండు కిలోల వరకు పెరగాలంటే కనీసం ఐదు నుంచి ఆరు నెలలు నీటిలో ఉండాలి. వర్షాలు ఆలస్యంగా కురవటంతో అక్టోబరు, నవంబరు మాసాల్లో చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదిలారు. ఆ తర్వాత వర్షాల జాడే లేకుండాపోయింది. ప్రస్తుతం ఉన్న నీరు తగ్గుముఖం పట్టడంతో ఎండకు నీరు వేడిగా మారి.. వాటి పరిమాణం పెరగలేకపోయింది. ఫలితంగా మత్స్యకారులే చేపలు పట్టి మార్కెట్లకు తరలించి తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిన పరిస్థితి.
ఉమ్మడి జిల్లాలో 3,096 చెరువులు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,096 చెరువులు ఉండగా.. 445 మత్స్య సహకార సంఘాలున్నాయి. వాటిలో 49,583 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. ఈ సారి 2,591 చెరువుల్లో అధికారులు చేప పిల్లలు వదిలారు. అదను దాటి వదలటంతో పరిమాణం పెరగలేదు. కొన్నిచోట్ల ఎండలను చూసి పెద్దగా పెరగకపోయినా వాటిని పట్టి అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల నీరున్న ప్రాంతాలను చూసి పట్టి అందులో వదిలినట్లు సమాచారం. కొందరు వ్యాపారులు 250 గ్రాముల వరకు పెరిగిన చేపలను స్థానిక మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండటంటతో పూర్తిస్థాయిలో చెరువులు ఎండిపోయే ప్రమాదం ఉంది. భానుడి ప్రతాపంతో ఇప్పటికే చేపలు మృత్యువాత పడుతున్నట్లు మత్స్యకారులు వాపోయారు. ఈ సారి వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో మార్చిలోనే అడుగంటి చాలావరకు చేపలు ఎదగలేదు. దీనికి తోడు ఆలస్యంగా పంపిణీ చేయడంతో వాటి వృద్ధిపై వేటుపడింది. చేపల వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులకూ ఈసారి ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
-కోల కరుణాకర్, ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, సూర్యాపేట
ఎండల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలోని చెరువులు ఎండిపోయాయి. మత్స్యకారులకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎండిపోయిన చెరువుల పరిధిలోని మత్స్యకారులను ఆదుకోవాలి. వారికి పరిహారం అందించి తోడ్పాటునందించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్