రైతన్నలూ సాగుకు సన్నద్ధం కండి
గత అనుభవాల దృష్ట్యా వ్యవసాయశాఖ ఓ అడుగు ముందుకేసింది.. రైతన్నలను సాగుకు సిద్ధం చేస్తోంది.. ముందస్తు నాట్లు వేసుకొని రాబోయే వర్షాలకు నష్టం వాటిల్లకుండా అప్రమత్తం చేస్తోంది.. మరోవైపు జలవనరులశాఖ సాగునీటిని విడుదల చేయడంతో
సమృద్ధిగా ఎరువులు, విత్తనాలు
సుధాకర్రాజు, జేడీ, వ్యవసాయశాఖ
న్యూస్టుడే, నెల్లూరు (వ్యవసాయం) గత అనుభవాల దృష్ట్యా వ్యవసాయశాఖ ఓ అడుగు ముందుకేసింది.. రైతన్నలను సాగుకు సిద్ధం చేస్తోంది.. ముందస్తు నాట్లు వేసుకొని రాబోయే వర్షాలకు నష్టం వాటిల్లకుండా అప్రమత్తం చేస్తోంది.. మరోవైపు జలవనరులశాఖ సాగునీటిని విడుదల చేయడంతో వడివడిగా పొలం పనులు చేపట్టాలని వ్యవసాయశాఖ జేడీ సుధాకర్రాజు అన్నదాతలకు సూచించారు. విత్తనాలు, ఎరువులు జిల్లాకు సరిపడా అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయనతో ‘న్యూస్టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వివరాలు ఆయన మాటల్లోనే..
15 వేల కిసాన్ క్రెడిట్ కార్డుల లక్ష్యం
సొంత భూమి ఉండి ఇప్పటివరకు పంట రుణాలు తీసుకోని 15 వేల మంది రైతులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరయ్యేలా దృష్టిసారించాం. 25 వేల మంది కౌలు రైతులకు పంట హక్కు పత్రాలు అందజేసి బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్నాం.
ఎరువులకు ఇబ్బందుల్లేవ్..
ఖరీఫ్ సీజన్కు ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాం. సీజన్కు సంబంధించి 1.22 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమవుతుండగా ఇప్పటికే డీఏపీ 4,500 ఎంటీలు, కాంప్లెక్సు ఎరువులు 14,500 ఎంటీలు, యూరియా 21 వేలు ఎంటీలు, ఎంవోపీ 2,200 ఎంటీలు, ఎస్ఎస్ఎస్ 3,200 ఎంటీలు సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబరు చివరి వరకు మిగతావి విడతల వారీగా వస్తాయి. ఫలితంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
అంచనాలకు మించి సాగు
జిల్లాలో ఖరీఫ్ సీజన్ అంచనాలకు మించి సాగవనుంది. సాధారణ విస్తీర్ణ లక్ష్యం 1.20 లక్షల ఎకరాలకు 1.85 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో వరి పంట లక్ష ఎకరాలకు పైగా సాగులోకి రానుంది. ఇప్పటికే 18,990 ఎకరాల్లో వేరుశనగ, పత్తి, ఇతర పంటలు వేశారు. ఈ దఫా పత్తి ధర క్వింటా రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. దాంతో రైతులు ఎక్కువగా ఈ పంట సాగు చేసే అవకాశం కనిపిస్తోంది.
89 వేల క్వింటాళ్ల విత్తనాలు
వ్యవసాయశాఖ తరఫున అందజేస్తున్న వరి విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి. జిల్లాకు 52 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతుండగా, వ్యవసాయశాఖ వద్ద ఇప్పటికే 89 వేల క్వింటాళ్ల ధాన్యం అందుబాటులో ఉంది. ఎన్ఎల్ఆర్ 34449, కేఎన్ఎం 1638, జేజీఎల్ 1798 వంటి రకాలు ప్రస్తుత సాగుకు అనుకూలం. ఎన్ఎల్ఆర్ 34449 రకం దాదాపు 60 వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. విత్తనాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. భూమిని సారవంతం చేసేందుకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను ఎస్టీ రైతులకు 90 శాతం, ఎస్సీ, బీసీ, ఓసీ రైతులకు 50 శాతం రాయితీతో ఇస్తున్నాం. ఆర్బీకేల్లో వీటిని తీసుకోవచ్చు.
వచ్చే నెల ఒకటి నుంచే ఈ-క్రాప్ నమోదు
గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా ఈ-క్రాప్ను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. రైతులు తప్పనిసరిగా దీనిలో నమోదు చేసుకోవాలి. ఫలితంగా వ్యవసాయశాఖ ద్వారా అమలయ్యే సున్నా వడ్డీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి వాటికి ఇబ్బందులు ఉండవు. వ్యవసాయ సహాయకుల ద్వారా పొలాల వద్దే పండించిన పంటను ఈ-క్రాప్లో నమోదు చేయడంతో పాటు రైతుల వేలిముద్రలు (ఈకేవైసీ) సేకరిస్తాం. ప్రత్యేక యాప్ ద్వారా పంటల వివరాలను పక్కాగా నమోదు చేస్తున్నాం. వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి వచ్చే నెల ఆరో తేదీన మెగా మేళా నిర్వహిస్తున్నాం. వ్యవసాయ పరికరాలకు రైతులు జమచేసిన రాయితీ మొత్తాన్ని వారి ఖాతాల్లో వేస్తున్నాం. ట్రాక్టర్ల కింద 202 మంది దరఖాస్తు చేసుకోగా 160 మంది వరకు రాయితీ కట్టారు. 56 వరికోత యంత్రాలను 36 మందికి మంజూరు చేశాం.
సాగుకు సిద్ధం చేస్తున్న పొలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్