జూనియర్ కళాశాలల్లో ఆకలి కేకలు
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారు.. సుదూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. ఆ సమయానికి ఇళ్లల్లో భోజనం సిద్ధం కాకపోవడంతో చదువుల కోసం విద్యాలయాలకు వచ్చేవారు.
మూడున్నరేళ్లుగా అమలు కాని మధ్యాహ్న భోజనం
న్యూస్టుడే, నెల్లూరు (విద్య): ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారు.. సుదూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. ఆ సమయానికి ఇళ్లల్లో భోజనం సిద్ధం కాకపోవడంతో చదువుల కోసం విద్యాలయాలకు వచ్చేవారు. సాయంత్రం తరగతులు ముగిశాక ఇళ్లకు వెళ్లే వరకు ఖాళీ కడుపులతోనే ఉంటుండటంతో 2018లో రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేసింది. దీనికి మంచి స్పందన వచ్చింది. విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించడంతో మూడున్నరేళ్లుగా విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవస్థలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు చాలా వరకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారే. వారు పదో తరగతి తర్వాత ఇంటర్ విద్యను కొనసాగించేలా ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 2018లో ప్రవేశపెట్టింది. ఉదయం ఇంటి వద్ద పనులు చేసుకుని కళాశాలకు వచ్చే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇదెంతో ఉపయుక్తంగా ఉండేది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసింది. అప్పట్లో తిరిగి ప్రారంభిస్తామని చెప్పిందే తప్ప.. నేటికీ అమలు చేసిన దాఖలాలు లేవు. గ్రామీణ ప్రాంతాల్లో వేకువజామునే తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో మధ్యాహ్న భోజనం ఇళ్లలో సిద్ధం చేసేవారు లేక క్యారేజీలు తెచ్చుకోవడం లేదు. ఒక వైపు పుస్తకాలు అందించకపోగా.. మరోవైపు మధ్యాహ్న భోజనం లేక పేద విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 23 ఉన్నాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 7,800 మంది వివిధ కోర్సులు చదువుతున్నారు. దీనికి తోడు గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించింది. మొదట 18 పాఠశాలలను ప్రతిపాదించినా 12 చోట్ల బాలికలకు మాత్రమే మొదటి విడతగా ఇంటర్ విద్యను అందించారు. ఆయా కళాశాలల్లో 180 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ మధ్యాహ్న భోజనానికి అవస్థలు పడుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మధుబాబు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి
గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేవారు. ఇది పేద విద్యార్థులకు అనుకూలంగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని నిలిపేసి అమ్మఒడి, తదితర పథకాలను అమలు చేస్తోంది. కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అందించే విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!