logo

ఖాదీ బోర్డు డీడీగా సురేష్‌

ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు (ఏపీకేవీఐబీ) జిల్లా డీడీ (ఎఫ్‌ఏసీ)గా ఎస్‌.వి.సురేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 26 Mar 2023 02:07 IST

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు (ఏపీకేవీఐబీ) జిల్లా డీడీ (ఎఫ్‌ఏసీ)గా ఎస్‌.వి.సురేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తిరుపతిలో ఏపీఐఐసీ ప్రత్యేక ప్రాజెక్టు డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించగా విధుల్లో చేరారు.

రేపు అవగాహన సదస్సు

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ)పై సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు కేవీఐబీ డీడీ ఎస్‌.వి.సురేష్‌ తెలిపారు. నగరంలోని కామాటివీధి కృష్ణ మందిరం కల్యాణమండపంలో  మధ్యాహ్నం మూడు గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని