ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.
18 నుంచి నామినేషన్ల ప్రక్రియ కలెక్టర్ హరినారాయణన్
ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మీడియా సెంటర్ వద్ద ఆయన ఎన్నికల ఏర్పాట్లపై వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
సెలవు రోజులు మినహాయించి..
జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, లోక్సభ నియోజకవర్గానికి నెల్లూరు కలెక్టరేట్లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారు. అందుకు రిటర్నింగ్ అధికారులు ఫారం 1 నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల చేస్తారు. అప్పటి నుంచి 25 వరకు ప్రభుత్వ సెలవులు మినహాయించి.. మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
ఫారం7 ద్వారా అభ్యర్థుల ప్రకటన
పోటీలో నిలిచిన అభ్యర్థులను ఫాం-7ఎ ద్వారా ప్రకటిస్తాం. మే 12 వరకు పోస్టల్ బ్యాలెట్లు, శిక్షణ మొదలైన ఎన్నికల ప్రక్రియ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. మే 12న పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, స్టేషనరీ, ఇతర పోలింగ్ సామగ్రి అందిస్తాం. ముందుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ మేరకు ఆయా కేంద్రాలకు సిబ్బందిని వాహనాల్లో పంపుతాం. మే 13న పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు.
పోస్టల్ బ్యాలెట్కు..
మే 3వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్లు ప్రింట్ అవుతాయి. కేటగిరీల వారీగా అందిస్తాం. మీడియా, పోలీసువారు ఆయా ఆర్వో కార్యాలయాల్లోనే వాటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. సర్వీసు ఓటర్లు.. ఓటరు పెసిలిటేషన్ కేంద్రాల్లో మాత్రమే వినియోగించుకోవాలి. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇస్తున్న కేంద్రాల్లో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
58 కేసుల నమోదు..
ఇప్పటి వరకు రూ. 2.63 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశారు. ఇప్పటి వరకు 58 కేసులు నమోదు కాగా- 35 పరిష్కరించాం. 23 పరిశీలనలో ఉన్నాయి. వెబ్ కెమెరాతో నమోదు చేస్తున్నాం.
అవగాహన కార్యక్రమాలు
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు ఉందో తెలిసేలా చర్యలు చేపట్టాం. జిల్లాలో గతానికంటే.. ఎక్కువగా ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనార్టీల అభ్యున్నతిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది!
[ 29-04-2024]
‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. -
ఆత్మస్తుతి.. హామీల ఊసేది
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. -
గొప్పలు.. ప్రజారోగ్యానికి తిప్పలు
[ 29-04-2024]
ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నాడు-నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ఉప, పట్టణ ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. -
చెంతనే నీరున్నా.. చింతే నాయకా
[ 29-04-2024]
వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా.. -
జగనూ.. చెరువులను మింగేస్తున్నారు
[ 29-04-2024]
పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి. -
సంగం హామీకి సున్నం
[ 29-04-2024]
దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు. -
అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్ అరెస్టు
[ 29-04-2024]
అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు. -
సమకూరని మౌలిక వసతులు
[ 29-04-2024]
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. -
పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ, -
వేడుకగా మహా పట్టాభిషేకం
[ 29-04-2024]
బాలాజీనగర్లోని సీతారామ మందిరంలో ఆదివారం స్వామివారికి మహా పట్టాభిషేక వేడుకలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?