కేసరగుంట.. అవస్థలేనంట
పట్టణంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కేసరగుంట కాలనీ ఒకటి. పల్లెల నుంచి కందుకూరు పట్టణానికి వలస వచ్చే వారు ఈ ప్రాంతంలోనే నూతన భవనాలు నిర్మించుకుంటున్నారు.
మౌలిక వసతుల లేమితో స్థానికుల అవస్థలు
కందుకూరు పట్టణం, న్యూస్టుడే: పట్టణంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కేసరగుంట కాలనీ ఒకటి. పల్లెల నుంచి కందుకూరు పట్టణానికి వలస వచ్చే వారు ఈ ప్రాంతంలోనే నూతన భవనాలు నిర్మించుకుంటున్నారు. మౌలిక వసతుల సమస్య కాలనీని తీవ్రంగా వేధిస్తోంది. కాలువలు, రోడ్లు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో కాలనీ మొత్తం చెరువును తలపిస్తోంది. ఎగువన ఉన్న కేసరగుంట సంగం, అగ్నిమాపక కార్యాలయం, సింహాద్రినగర్ పడమర ప్రాంతాల నుంచి వరద భారీగా చేరుతోంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న రెండు ప్రైవేటు పాఠశాలలు మధ్య మోకాల్లోతు నీళ్లు నిలుస్తున్నాయి. భారీ వర్షం పడినప్పుడు ఇక పరిస్థితి వర్ణనాతీతం. కాలనీలోని భూములు ఆర్ఎస్ఆర్లో ప్రైవేటు భూములున్నా.. గతంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తయారు చేసిన మాస్టర్ప్లాన్లో ఈ కాలనీని కుంటగా నమోదు చేయడంతో అనుమతులు రావడం లేదు. సుమారు 10 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో నూతనంగా ఇల్లు కట్టుకునే వారికి మున్సిపాలిటీ నుంచి ప్లాన్ అనుమతులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై పలుమార్లు మున్సిపల్, సబ్కలెక్టర్ కార్యాలయాల్లో స్థానికులు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదు.
అనుమతులు రావడం లేదు :
యు.విష్ణు.
మాకు కేసరగుంట ప్రాంతంలో ఇంటి స్థలం ఉంది. ఇల్లు కట్టుకుందామని అనుకుంటే మున్సిపాలిటీ నుంచి ప్లాన్ అనుమతులు రావడం లేదు. కుంట భూమిగా నమోదై ఉన్న కాలనీ ప్రైవేటు భూమిగా మారాలంటే నూతన మాస్టర్ప్లాన్ అమలులోకి రావాలని చెబుతున్నారు. మా సమస్య ఎప్పటికీ పరిష్కారమవుతుందో తెలియడం లేదు.
కాలువల్లేక మురుగు పారక..
బి.కృష్ణారావు
కాలనీలో రోడ్లు, కాలువలు లేక ఇబ్బంది పడుతున్నాం. వర్షాకాలం వచ్చిందంటే ఇళ్ల పక్కన ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉంటోంది. దోమలు, పందుల బెడద అధికంగా ఉంటుంది. కాలువలు ఏర్పాటు చేయాలని అనేకసార్లు విన్నవించాం. అధికారులు పట్టించుకోవడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముస్లిం మైనార్టీల అభ్యున్నతిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది!
[ 29-04-2024]
‘రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే కూటమిగా పోటీ చేస్తున్నాం. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, సంక్షేమానికి ఎన్డీయేతో కలిసిన తెదేపా ప్రభుత్వంలో విశేషంగా కృషి చేశాం. మళ్లీ కూటమికి ఓటేసి గెలిపిస్తే.. మరింతగా పాటుపడతాన’ని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. -
ఆత్మస్తుతి.. హామీల ఊసేది
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కందుకూరు పట్టణానికి వస్తున్నారని తెలిసి.. ఆశతో వచ్చిన ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. -
గొప్పలు.. ప్రజారోగ్యానికి తిప్పలు
[ 29-04-2024]
ప్రతి గ్రామానికి వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నాడు-నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నాం. ఉప, పట్టణ ఆరోగ్య కేంద్రాలను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నా.. -
చెంతనే నీరున్నా.. చింతే నాయకా
[ 29-04-2024]
వేసవి వచ్చింది... నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పొంచిఉంది. నీటి వనరులున్నా.. నిర్వ హణ లోపంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. పథకాలున్నా.. -
జగనూ.. చెరువులను మింగేస్తున్నారు
[ 29-04-2024]
పూర్వీకులు ఎంతో ముందుచూపుతో చెరువులను ఏర్పాటుచేశారు. గొలుసుకట్టు విధానంలో ఉండడంతో వరద నివారణ సాధ్యమయ్యేది. భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాలు తీరడంతో పాటు సాగుకు ఆధారంగా ఉన్నాయి. -
సంగం హామీకి సున్నం
[ 29-04-2024]
దుష్ట సంహారం నిమిత్తం పరమేశ్వరుడు వినియోగించే ధనస్సుని ‘పినాక ’అంటారు. పినాక ధారుడైన పరమశివుడిని ‘పినాకపాణి’ అని భక్తులు పూజిస్తారు. కర్ణాటక రాష్ట్రం నంది పర్వత సానువుల్లో ఉద్భవించిన నది వంపులు తిరిగి శివుడి విల్లు పినాక ఆకారంలో ఉండటంతో పెన్నానది అని పిలుస్తున్నారు. -
అక్రమాలకు పాల్పడిన ఏపీజీబీ మేనేజర్ అరెస్టు
[ 29-04-2024]
అమడగూరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో గతంలో మేనేజర్గా పని చేసిన కమతం పెంచల్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదివారం కదిరి జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెసిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి సుందరి ఎదుట హాజరు పరిచినట్లు అమడగూరు ఎస్ఐ మగ్బూల్బాషా తెలిపారు. -
సమకూరని మౌలిక వసతులు
[ 29-04-2024]
మండలంలోనే పెద్ద పంచాయతీ బ్రాహ్మణక్రాక అరుంధతి వాడలోని అంతర్గత రోడ్డు ఇది. మురుగు నీటి కాలువలు పూడి పోయాయి. దిగువ ప్రాంతాలకు మురుగు పారక..రోడ్డుపై నిల్వ ఉంది. కాలనీ వాసులు ఈ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. -
పోలింగ్ కేంద్రాలకు అధికారుల కేటాయింపు
[ 29-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం కలెక్టరేట్లో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్ను సాధారణ పరిశీలకులు నితిన్ సింగ్ బదారియ, -
వేడుకగా మహా పట్టాభిషేకం
[ 29-04-2024]
బాలాజీనగర్లోని సీతారామ మందిరంలో ఆదివారం స్వామివారికి మహా పట్టాభిషేక వేడుకలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా