logo

జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు

సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన జ్యోతిమోయ్‌ బయ్‌లంగ్‌, కంచన్‌ రామ్‌ మీనా నెల్లూరుకు విచ్చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు.

Published : 18 Apr 2024 03:36 IST

కంచన్‌ రామ్‌ మీనాకు పుష్పగుచ్ఛం అందిస్తున్న అధికారులు

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన జ్యోతిమోయ్‌ బయ్‌లంగ్‌, కంచన్‌ రామ్‌ మీనా నెల్లూరుకు విచ్చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. వారిని నుడా వీసీ బాపిరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటరమణ పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. కందుకూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా జ్యోతిమోయ్‌ బయ్‌లంగ్‌, కోవూరు, నెల్లూరు నగరం, రూరల్‌, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా కంచన్‌ రామ్‌ మీనా వ్యవహరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని