జనానికి ‘జగన్’ షాక్
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు.
మాటతప్పి అయిదేళ్లలో అయిదుసార్లు పెంపు
రకరకాల పేర్లతో రూ.852.58 కోట్ల అదనపు భారం
ఈనాడు, నెల్లూరు: విద్య, న్యూస్టుడే
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. అయిదేళ్లలో అయిదుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి.. ప్రజలకు షాక్ ఇచ్చారు. అసలు బిల్లు మూరెడైతే.. కొసరు బిల్లు బారెడు అయింది. ట్రూఅప్, ఇంధన సర్దుబాటు ఛార్జీలు(ఎఫ్పీపీసీఏ).. పేర్లతో అదనపు భారాన్ని ప్రజలపై మోపారు. ఏ ఇంటి విద్యుత్తు బిల్లు చూసినా.. ప్రభుత్వ టారిఫ్ ప్రకారం వినియోగించిన విద్యుత్తుకు వసూలు చేసే మొత్తంతో పాటు ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ (2021-22), ఎఫ్పీపీసీఏ(6/2023) పేర్లతో అదనపు ‘బాదుడే బాదుడు’కు తెరదీశారు.
ఈమె పేరు దారా మరియమ్మ. నెల్లూరు నగరం కొండాయపాళెం పరిధిలోని నక్కలగుంట దగ్గర తన తల్లికి ఇందిరమ్మ ఇళ్లు పథకంలో ఎప్పుడో ఇచ్చిన ఇంట్లో మనవరాలితో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం అదీ శిథిలావస్థకు చేరుకుంది. ఒక లైటు, ఫ్యాన్, టీవీ మాత్రమే ఉన్నాయి. ఈ ఇంటికి రూ. 1150 విద్యుత్తు బిల్లు రావడంతో ఆమె కంగుతిన్నారు. ఇంటి ముందు కూరగాయలు పెట్టుకుని.. అందులో వచ్చే డబ్బుతో కడుపు నింపుకొనే మేము.. అంతేసి బిల్లులు ఎలా కట్టగలమని వాపోయారు. గతంలో ఉచితంగా ఇచ్చేవారని, ఇప్పుడు బిల్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలకు తేడా అర్థం కావడానికి ప్రజలకు అట్టే సమయం పట్టలేదు. పేదలకు విద్యుత్తు ఛార్జీలతో షాక్ ఇచ్చారు. ఏటా ఏదో ఒక పేరుతో భారం మోపి నడ్డి విరిచారు. సంక్షేమం పేరుతో ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో విద్యుత్తు ఛార్జీల రూపంలో ఎలా లాగేసుకున్నారో తెలుసుకునేందుకు భారీగా వస్తున్న విద్యుత్తు బిల్లులే నిదర్శనంగా నిలిచాయి. 2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నష్టాలు వచ్చాయంటూ.. ఆ సమయంలో వినియోగించుకున్న ప్రతి యూనిట్కు 22 పైసల మేర లెక్కకట్టి బిల్లులో విధించారు. ప్రతి నెలా బిల్లు వచ్చీ రావడంతోనే ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ భారం ఎంత పడిందో చూసుకునే దుస్థితిని వినియోగదారులకు ప్రభుత్వం కల్పించింది. ఏడాదిలో విద్యుత్తు కొనుగోలు, ఇతర ఖర్చులకు ఏపీఆర్సీ అనుమతించిన మొత్తానికి అదనంగా చేసిన ఖర్చును ట్రూఅప్ పేరుతో డిస్కంలు వసూలు చేశాయి. నెల్లూరు సర్కిల్ పరిధిలో మొత్తం 12 లక్షలకుపైగా విద్యుత్తు కనెక్షన్లు ఉండగా- వీటిల్లో గృహ, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లపైనే ఎక్కువ మోపారు. నికరంగా 10 లక్షల మంది వినియోగదారులపై మొత్తం రూ. 852.58 కోట్ల మేర అదనపు భారం వేశారు.
అదనపు వడ్డింపు ఇలా...
- ట్రూఅప్ ఛార్జీలు యూనిట్కు 17 పైసల చొప్పున.. నెల్లూరు సర్కిల్ వినియోగదారుల నుంచి నెలకు రూ. 6.85 కోట్లు వసూలు చేశారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వినియోగదారుల నుంచి రూ. 116.61 కోట్లు వసూలు చేశారు.
- ఎఫ్పీపీసీఏ-2 పేరుతో 2023 మే నుంచి యూనిట్కు 40 పైసల చొప్పున మరో భారం మోపుతున్నారు. సర్కిల్లో రోజుకు సగటున 13.45 మి.యూనిట్ల విద్యుత్తు వినియోగం జరుగుతోంది. ఆ లెక్కన నెలకు రూ. 16.14 కోట్ల అదనపు సుంకం విధిస్తున్నారు. ఇప్పటికే 12 నెలల నుంచి నెలకు రూ. 16.14 కోట్ల చొప్పున రూ. 484.20 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేశారు. మరో ఏడాది పాటు ఈ ఇంధన కొనుగోలు సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలు మోయాల్సిందే.
రెట్టింపు అయ్యింది
- యూ.లక్ష్మి, కందుకూరు
గతంలో మాకు రూ. 250 వచ్చేది. ఇప్పుడు రూ. 250 నుంచి రూ. 600 వస్తుంది. ఫ్యాన్లు, లైట్లు వేయాలంటే భయపడాల్సి వస్తోంది. గత కొన్నేళ్లుగా.. 3, 4 నెలలకు ఒకసారి ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇందులో ట్రూఅప్, ఎఫ్పీపీసీఏ బిల్లులు కలిపి వడ్డిస్తున్నారు. పెరిగిన బిల్లులు కట్టాలంటే కష్టంగా మారింది.
ఎలా భరించగలం..
- బడితల నాంచారమ్మ, ఉలవపాడు
విద్యుత్తు బిల్లులు భరించలేకున్నాం. నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. గతంలో రూ.125నుంచి రూ.145 వచ్చే బిల్లులు శ్లాబ్ సిస్టం మార్చడంతో రూ.600 వరకు వస్తోంది.
జిల్లాలో కనెక్షన్లు..(సుమారుగా)!
- గృహ: 9,04,358
- వాణిజ్య: 88,190
- పరిశ్రమలు: 4,148
- వ్యవసాయం: 1,61,878
- ఆక్వా: 26,230
- హెచ్టీ: 658
- ఇతర: 24,897
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటింటికీ ఇచ్చేందుకు ఇబ్బందేంటి జగన్!
[ 01-05-2024]
సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్ణయం.. వృద్ధులకు ప్రాణ సంకటంగా మారింది. ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగా అవస్థలు పెట్టేందుకు కుట్ర పన్నింది. -
నేడు లోకేశ్ ‘యువగళం’
[ 01-05-2024]
నెల్లూరు నగరంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. -
తీరంలో.. రాజకీయ రాబందులు
[ 01-05-2024]
పెన్నమ్మ అధికార పక్షంలోని సామంతులకు ఆదాయ వనరులా మారింది. తీరంలోని 42వేల ఎకరాల్లో... నాలుగో వంతు ఆక్రమణకు గురైంది. -
అంపశయ్యపై.. అత్యవసర వైద్యం
[ 01-05-2024]
ఆసుపత్రులను ఆధునికీకరిస్తాం..వసతులు కల్పిస్తాం.. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం: ఇవీ ముఖ్యమంత్రి జగన్ పలు సందర్భాల్లో చెప్పిన మాటలు. మెరుగైన వైద్యం సంగతేమో గానీ అత్యవసర వైద్యమే అందడం లేదు. -
ఎన్నికల బరిలో 129 మంది
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ పూర్తై.. జిల్లాలో ఎన్నికల బరిలో 129 మంది అభ్యర్థులు నిలిచినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. -
పథకాలు రద్దు.. కష్టాల పొద్దు
[ 01-05-2024]
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం పట్టలేదు.. భవన నిర్మాణ కార్మికులకు అందే పథకాలు నిలిచిపోయాయి.. ప్రస్తుత ప్రభుత్వంలో కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. జీవనమే కష్టమైపోయిన వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.. -
విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు యువకుల మృతి
[ 01-05-2024]
యువకుల ఈత సరదా ఆ కుటుంబంలో విషాదం నింపింది. పెన్నా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు. -
సౌర నీటి పథకాలకు వైకాపా గ్రహణం
[ 01-05-2024]
మండలంలో పెద్దనాగంపల్లి, బోడసిద్ధాయపల్లి ఎస్టీకాలనీ, గోనువారిపల్లి, చింతోడు, నాగరాజుపల్లి ఎస్టీకాలనీ, రంగనాయుడుపల్లి ఎస్టీకాలనీ, వడ్లవారిపల్లి, నెమళ్లదిన్నె ఎస్టీకాలనీ, దేవమ్మచెరవు ఎస్టీకాలనీల్లో సౌరవిద్యుత్తు ఆధారంగా పనిచేసే నీటిపథకాలను కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
జగజ్జంత్రి.. క్రీడలకు ఉరి
[ 01-05-2024]
పల్లెల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించింది. వసతులు కల్పించకపోగా గత తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన పనులు నిలిపేసింది. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభించిన స్టేడియాల పనులు చేసిన గుత్తేదారులకు బిల్లులు ఆపేసింది. -
జగనన్న ఆసుపత్రి ఏదీ?
[ 01-05-2024]
తీరప్రాంత ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి శ్రద్ధ కరవైంది. ఆసుపత్రి కట్టిస్తామని భారీగా నిధులు కేటాయించి ఊరించారు. ఐదేళ్లయినా అడుగులు పడకపోవడంపై జగనన్నా మా ఆరోగ్య పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
దుర్మార్గ పాలనకు చరమగీతం పాడదాం: తెదేపా
[ 01-05-2024]
రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేశారు. -
పండుటాకుల ఉసురు పోసుకుంటున్నారు!
[ 01-05-2024]
మే, జూన్ ఫించన్ నగదును వారి ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పింఛన్ల సొమ్ము తీసుకునేందుకు కష్టాలు తప్పేలా లేదు. ఉలవపాడు మండలంలో మొత్తం 8603మందిలో 2147మందికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇవ్వాలి. -
నేడు రాష్ట్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి
[ 01-05-2024]
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రకటనలో తెలిపారు. -
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నపై కేసు నమోదు
[ 01-05-2024]
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. కొత్తూరులో ఎన్నికల ప్రచారంలో ప్రసన్న.. -
నోటాకు ఓటు వేయాలని వైకాపా నాయకుడి ప్రచారం
[ 01-05-2024]
మండల పరిధిలోని పడమటి కంభంపాడు గ్రామంలో వైకాపా సీˆనియర్ నేత, ఉప సర్పంచి దుగ్గిరెడ్డి రత్నారెడ్డి నోటాకు ఓటు వేయమని మంగళవారం ఇంటింటా ప్రచారం చేశారు. -
కాంగ్రెస్తోనే దేశానికి మేలు: కొప్పుల రాజు
[ 01-05-2024]
కాంగ్రెస్తోనే దేశానికి మేలు జరుగుతుందని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థ్ధి కొప్పుల రాజు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ట్రంకురోడ్డులో ప్రదర్శన నిర్వహించారు.