హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా...
ఒప్పంద ఉద్యోగుల ఆవేదన
న్యూస్టుడే, దుత్తలూరు
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా...
2019 ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పదేపదే చెప్పిన మాటలు
గోపాలమిత్ర
జిల్లాలో 37 మండలాల్లో 300కు పైగా గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. వీరికి గతంలో నెలకు రూ. 3,500 అందే గౌరవ వేతనాన్ని తెదేపా ప్రభుత్వ హయాంలో రూ. 6,500కు పెంచారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు గౌరవ వేతనాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. పాలన చేపట్టి అయిదేళ్లు పూర్తవుతున్నా పైసా కూడా పెంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత ఎటూ కల్పించలేదు. ఆపై పైసా పెంపుదల లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగంలో చేరిన ప్రారంభంలో పాడి పశువులకు వైద్య చికిత్స అందిస్తే సంబంధిత రైతులు తగిన మొత్తం ఇచ్చేవారని జీతం ప్రవేశపట్టాక ఎటూ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టా పెట్టదు.. రైతులనూ ఇవ్వనివ్వదన్నట్లు తమ పరిస్థితి తయారైందని వాపోతున్నారు.
ఎస్ఎస్ఏ
సమగ్రశిక్షా అభియాన్ కింద మండల వనరుల కేంద్రాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, సీఆర్పీలుగా పనిచేస్తున్నా ఒప్పంద ఉద్యోగులు జిల్లాలో 476 మంది వరకు ఉన్నారు. వీరందరికీ గత ప్రభుత్వ కాలంలో నెలకు రూ. 18 వేలు చెల్లించారు. దీన్ని మరో రూ.5,500 పెంచుతూ రూ. 23,500కు తీసుకెళ్లారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్ పాదయాత్రలో వీరి ఉద్యోగ సేవలను క్రమబద్ధీకరించడంతోపాటు జీతభత్యాలను రూ. 8 వేల వరకు పెంచుతామని హామీ ఇచ్చారు. అయిదేళ్లలో అయిదు పైసలు పెంచకపోగా సేవల క్రమబద్ధీకరణ నీటి మీద రాతలా అయిందని వారు వాపోతున్నారు. ప్రత్యేక అత్యవసరాల చిన్నారుల కోసం పనిచేసే ఐఈఆర్టీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మిత్రలు, వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగులు వేల మంది నిరాశ పడ్డారు. ఒప్పంద ఉద్యోగులకు జీతాలు పెంచలేదు. ఆందోళనలు, నిరసనలు చేసినా ప్రభుత్వ స్పందించలేదన్న విమర్శలొస్తున్నాయి.
దుత్తలూరులో అత్యవసరాలు కలిగిన పిల్లలకు పాఠాలు బోధిస్తున్న ఐఈఆర్టీ
వేతనం పెంచితే ఒట్టు
నారాయణ, ఒప్పంద ఉద్యోగి
పాదయాత్రలో గౌరవ వేతనం పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఎంతో సంతోషించాం. ఐదేళ్లుగా హామీ నెరవేరలేదు. ఏటా ఆశగా ఎదురుచూస్తున్నాం. అయినా ఎలాంటి ఫలితం లేదు. ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యం. మా బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గౌరవ వేతనం పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తే ఒప్పంద ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాకాసి చట్టం.. రాబందులకే చుట్టం!
[ 06-05-2024]
కొత్త చట్టంలో టీఆర్వోలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. ఏ స్థాయి అధికారికి బాధ్యత అప్పగిస్తారనే దానిపై స్పష్టత లేదు. -
నెల్లూరు గళం పార్లమెంట్లో వినిపిస్తాం
[ 06-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు గతంలో ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగం.. తొలిరోజే గందరగోళం!
[ 06-05-2024]
జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్కు దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఒక్కరితో బోధనెలా మామయ్యా!
[ 06-05-2024]
కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. -
ఈ జలం గరళం
[ 06-05-2024]
వేసవికాలం వచ్చింది. తాగునీటి వనరులు అడుగంటి కలుషితమవుతాయి. ఈనీరు తాగి వ్యాధులు ప్రబలుతాయి. -
పింక్ మోడల్ పోలింగ్ కేంద్రం ప్రారంభం
[ 06-05-2024]
పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పింక్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జనరల్ పరిశీలకులు రామ్కుమార్గౌతమ్, సబ్కలెక్టర్ జి.విద్యాధరి ప్రారంభించారు. -
అంబటి చెప్పినా ఏదీ ఫలితం?
[ 06-05-2024]
మెరుపు వరదలకు.. పెన్నానది పెట్టింది పేరు. దీనికి కుందు, సగిలేరు, చెయ్యేరు, గుంజనవాగు, పాపాఘ్ని, జయమంగళ, తీతా, బీరాపేరు, బొగ్గేరు తదితర వాగులు, ఉపనదులు ఉన్నాయి. -
మంచి పేరున.. ముంచిన జగన్
[ 06-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు. -
క్షేత్ర సహాయకుడి సస్పెన్షన్
[ 06-05-2024]
కొండికందుకూరు ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు ఏపీవో సుజాత తెలిపారు. -
విష గుళికలు మింగి..
[ 06-05-2024]
జలదంకికి చెందిన మింగికళ్లోల వెంకయ్య (40) - వెంగమ్మ దంపతులు కూలీ పనుల కోసం కొన్నిరోజుల క్రితం కరీంనగర్ జిల్లా బంజరుపల్లికి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా