అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.
గోషా ఆసుపత్రి భవనానికే పరిమితం
నెల్లూరు(నగరపాలకసంస్థ): న్యూస్టుడే: మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. నగర ఎమ్మెల్యే అనిల్కుమార్ మరో అడుగు ముందుకేసి.. ఆసుపత్రిని నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే.. ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని సెలవిచ్చారు. 23.1.2021న రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో శంకుస్థాపన చేశారు. ఎన్నికలైతే వచ్చాయి గానీ.. మూడేళ్లుగా భవన నిర్మాణం కొనసాగుతూనే ఉంది.
రూ. 3.82 కోట్లతో..
నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో గోషా ఆసుపత్రి నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రజారోగ్య, పురపాలక సాంకేతికశాఖ ఆధ్వర్యంలో రూ. 3.82 కోట్లతో నిర్మించాలని నిర్ణయించి.. గుత్తేదారుకు పనులు అప్పగించారు. అధికార పార్టీ నాయకుడి అనుచరుడికే పనులు కట్టబెట్టగా.. గత మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. భవనం మాత్రమే నిర్మించి.. సున్నం వేసి వదిలేశారు.
పట్టించుకుంటే ఒట్టు..
ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని ఎదురు చూసిన నగర మహిళలకు నిరాశే ఎదురవుతోంది. భవనం కట్టి.. పూర్తి చేసినట్లు వైకాపా నాయకులు ప్రచారం చేసుకుంటుండగా- వైద్య సేవలకు అవసరమైన ఆపరేషన్ థియేటర్, కాన్పుల గది తదితర సౌకర్యాల కల్పనకు మరో మూడేళ్లు పట్టేలా ఉంది. భవనానికి శంకుస్థాపన చేసిన పాలకులు.. అనంతరం పట్టించుకున్న దాఖలాలు లేవు.
మూడేళ్లుగా ఎదురుచూపులే
- షమీమ్, కోటమిట్ట
గోషా ఆసుపత్రి నిర్మించి మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తామని వైకాపా నాయకులు పలుమార్లు చెప్పారు. భవనం కట్టేందుకు మూడేళ్లు పట్టింది. సౌకర్యాలు కల్పించాలంటే... మరెన్నేళ్లు పడుతుందో?
మాటలకే పరిమితం
- రోషిణి, మన్సూర్నగర్
వైకాపా నాయకులు ఏడాదికే అందుబాటులోకి తెస్తామన్నారు. మాటలైతే చెప్పారుగానీ.. ఆసుపత్రి మాత్రం నిర్మించలేదు. నిర్మించి మహిళలకు అంకితం చేస్తామన్న మాటలు ఏమయ్యాయో తెలియడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాకాసి చట్టం.. రాబందులకే చుట్టం!
[ 06-05-2024]
కొత్త చట్టంలో టీఆర్వోలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. ఏ స్థాయి అధికారికి బాధ్యత అప్పగిస్తారనే దానిపై స్పష్టత లేదు. -
నెల్లూరు గళం పార్లమెంట్లో వినిపిస్తాం
[ 06-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు గతంలో ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగం.. తొలిరోజే గందరగోళం!
[ 06-05-2024]
జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్కు దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఒక్కరితో బోధనెలా మామయ్యా!
[ 06-05-2024]
కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. -
ఈ జలం గరళం
[ 06-05-2024]
వేసవికాలం వచ్చింది. తాగునీటి వనరులు అడుగంటి కలుషితమవుతాయి. ఈనీరు తాగి వ్యాధులు ప్రబలుతాయి. -
పింక్ మోడల్ పోలింగ్ కేంద్రం ప్రారంభం
[ 06-05-2024]
పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పింక్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జనరల్ పరిశీలకులు రామ్కుమార్గౌతమ్, సబ్కలెక్టర్ జి.విద్యాధరి ప్రారంభించారు. -
అంబటి చెప్పినా ఏదీ ఫలితం?
[ 06-05-2024]
మెరుపు వరదలకు.. పెన్నానది పెట్టింది పేరు. దీనికి కుందు, సగిలేరు, చెయ్యేరు, గుంజనవాగు, పాపాఘ్ని, జయమంగళ, తీతా, బీరాపేరు, బొగ్గేరు తదితర వాగులు, ఉపనదులు ఉన్నాయి. -
మంచి పేరున.. ముంచిన జగన్
[ 06-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు. -
క్షేత్ర సహాయకుడి సస్పెన్షన్
[ 06-05-2024]
కొండికందుకూరు ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు ఏపీవో సుజాత తెలిపారు. -
విష గుళికలు మింగి..
[ 06-05-2024]
జలదంకికి చెందిన మింగికళ్లోల వెంకయ్య (40) - వెంగమ్మ దంపతులు కూలీ పనుల కోసం కొన్నిరోజుల క్రితం కరీంనగర్ జిల్లా బంజరుపల్లికి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్