logo

ఎంపీ చొరవతోనే మంజూరు

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కృషి కారణంగానే మాధవనగర్‌ ఆర్వోబీ మంజూరైందని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పులాంగ్‌ చౌరస్తాలో ఎంపీ అర్వింద్‌ చిత్రపటానికి

Published : 23 Jan 2022 04:26 IST


పులాంగ్‌ చౌరస్తాలో ఎంపీ అర్వింద్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న భాజపా నాయకులు

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కృషి కారణంగానే మాధవనగర్‌ ఆర్వోబీ మంజూరైందని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పులాంగ్‌ చౌరస్తాలో ఎంపీ అర్వింద్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎట్టకేలకు ఇందూరు ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. వంతెన నిర్మాణానికి 15 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జాప్యమైందని ఆరోపించారు. గతంలో భాజపా ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటికైనా పనులు ప్రారంభించి వేగంగా పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా, న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, మల్లేష్‌యాదవ్‌, కిశోర్‌, కృష్ణ, వీరేందర్‌, సుక్క మధు, శ్రీనివాస్‌, పంచరెడ్డి లింగం, సుధీర్‌, చిరంజీవి, ప్రభాకర్‌, వినోద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని