నాసిరకం మాంసం విక్రయాలు!
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు.
మటన్ మార్కెట్లో కలకలం
న్యూస్టుడే, బాన్సువాడ పట్టణం : బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. మేక మెడకు గాయాలు ఉండటంతో గమనించిన పలువురు బల్దియాకు సమాచారం అందించారు. దీంతో కమిషనర్ తనిఖీలు చేపట్టారు. విక్రయిస్తున్న మాంసం నాసిరకంగా ఉందని, దానిని వ్యాపారి నుంచి స్వాధీనం చేసుకొన్నారు.
పర్యవేక్షణ లోపం..
ప్రతి రోజూ మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టాలి. వారు ధ్రువీకరిస్తేనే మేకను కోయాల్సి ఉంటుంది. ఇలా నిబంధనలు ఉన్నా ఇక్కడ అటువంటివి జరగకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యత లేని, రోగాల బారినపడిన వాటిని విక్రయిస్తున్నారు. పశువైద్యశాల అధికారులు సైతం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయమై వారిని సంప్రదిస్తే పుర అధికారులే చూస్తున్నారని చెప్పారు.
‘నాసిరకం మాంసం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు. ప్రత్యేక తనిఖీలు చేపడుతాం. మాంసాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఫుడ్ సేఫ్టీ అధికారులకు నాణ్యత ధ్రువీకరణ కోసం పంపనున్నాం. మేకను ఖననం చేశాం. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై పోలీసులను సంప్రదించి కేసులు నమోదు చేస్తాం. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం విక్రయాలు జరపాలి’ అని బాన్సువాడ బల్దియా కమిషనర్ అలీం తెలిపారు.
గడువు ఐదు రోజులే : కామారెడ్డి పట్టణం, న్యూస్టుడే: జిల్లాకేంద్రంలో 5 శాతం రాయితీపై ఆస్తి పన్ను చెల్లించేందుకు గడువు ఐదు రోజులే మిగిలి ఉంది. ఇప్పటివరకు రూ.20 లక్షల మేర పన్ను సమకూరింది. గతేడాది ఈపాటికి రెట్టింపు మేర పన్ను సమకూరింది. ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించి బల్దియాకు ఆదాయం సమకూర్చేందుకు తోడ్పాటును అందించాలని కమిషనర్ సుజాత కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో భారీగా చేరికలు
[ 05-05-2024]
రామారెడ్డి భారాస గ్రామ మాజీ యువజన అధ్యక్షుడు బండి ప్రవీణ్.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. -
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడగళ్ల వాన
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన పడుతోంది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. -
పెండింగ్ బిల్లులు ఇప్పిస్తాం
[ 05-05-2024]
ఇల్లు కట్టుకుని బిల్లులు రాని వారికి పెండింగ్లో ఉన్న బిల్లులు ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 05-05-2024]
భాజపాతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని భాజపా రాష్ట్ర ఉపాద్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
[ 05-05-2024]
బీర్కూర్కు చెందిన టేకు మహేష్ (30) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై రాజశేఖర్ ఆదివారం తెలిపారు. -
కొనసాగుతున్న భారాస ఎన్నికల ప్రచారం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ భారాస అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు ఓటు వేసి భారీ మెజారీటీతో గెలిపించాలని జడ్పీటీసీ మనోహర్ రెడ్డి అన్నారు. -
83 యూనిట్ల రక్త సేకరణ
[ 05-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో సమాజ సేవకులు, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తశిబిరం విజయవంతం అయింది. -
మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా మండలంలో ప్రచారం ఉద్ధృతం చేసింది. -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాండూరు, అక్కంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. -
పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలి
[ 05-05-2024]
ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు కృషి చేయాలని జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి అన్నారు. -
పార్టీ నిర్ణయాలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలి
[ 05-05-2024]
పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ అన్నారు. -
ఏ సామాజిక వర్గం ఎటు వైపో..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
వేధింపుల కట్టడికి అంతర్గత కమిటీలు
[ 05-05-2024]
పురపాలక కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇందూరు భగభగ
[ 05-05-2024]
ఇందూరులో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో మూడు ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లాయి. -
శతశాతంతో శెభాష్ అనిపించారు
[ 05-05-2024]
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జంగంపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు. -
పల్లెలపైనే పార్టీల ఆశలు
[ 05-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో పాగావేసేందుకు భారాస, కాంగ్రెస్, భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రచారసరళిని గమనిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. -
బిల్లులు ఇవ్వకుంటే ధర్నా చేస్తా
[ 05-05-2024]
పెండింగ్లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల తర్వాత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
‘జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు’
[ 05-05-2024]
కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
‘370 సీట్లతో భాజపా మూడోసారి అధికారంలోకి’
[ 05-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 370 సీట్లతో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారం చేపట్టనుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు..!
[ 05-05-2024]
భిక్కనూరు పోలీస్స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న నలుగురు నిందితులను ప్రత్యేక పోలీసు బృందం శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పట్టపగలే దొంగలు పడ్డారు
[ 05-05-2024]
నాలుగో ఠాణా పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. అరగంట వ్యవధిలోనే ఇల్లు గుల్లచేశారు. వివరాల్లోకి వెళ్తే వినాయక్నగర్ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్ తన కుటుంబ సభ్యులతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. -
పరీక్ష రుసుము చెల్లింపునకు అవకాశం
[ 05-05-2024]
డా బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2017 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో ప్రవేశం పొందిన, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్లాగ్ పరీక్ష రుసుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి, అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త రంజిత శనివారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.200తో ఈ నెల 6 వరకు, రూ.500తో 13 వరకు అవకాశం ఉందన్నారు