రోడ్షోలు.. సభలు
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు.
సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీలు
ఈనాడు, కామారెడ్డి : లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. పోలింగ్కు సమయం దగ్గరపడుతుండడంతో రోడ్షోలు, బహిరంగసభలు, కార్నర్ సమావేశాలు నిర్వహించేందుకు భారాస, కాంగ్రెస్, భాజపాల అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీలు, సభలకు అధినేతలు, ముఖ్య నేతలు పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. వీరితో పాటు స్వతంత్రులు సైతం తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు.
ప్రధాని సభకు భాజపా సన్నాహాలు
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అభ్యర్థిని ప్రకటించిన భాజపా ఇప్పటికే కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారం పూర్తిచేసింది. క్రియాశీల కార్యకర్తలతో పాటు బూత్, శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు కేంద్ర ప్రభుత్వ పరిపాలనను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టుసాధించేందుకు జాతీయస్థాయి నాయకులను ఆహ్వానించి రోడ్షోలు, బహిరంగసభలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 30న అందోల్లో ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. మెదక్, జహీరాబాద్ రెండు లోకసభ స్థానాలకు కలిపి ఉమ్మడి బహిరంగసభ నిర్వహించబోతోంది. ఇప్పటికే భాజపా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది.
పట్టణాలు, మండలకేంద్రాల్లో కాంగ్రెస్ ర్యాలీలు
ఈ నెల 26న జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముఖ్యపట్టణాలు, మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు గాంధారితో పాటు లింగంపేట మండలాల్లో ర్యాలీలు నిర్వహించారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ర్యాలీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన నియోజకవర్గాలపై కాంగ్రెస్ నేతలు ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు.
గ్రామస్థాయి సమావేశాలకు భారాస కసరత్తు
భారాస లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహించింది. మండలస్థాయిలోనూ పూర్తి చేసి గ్రామస్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. భారాస అధినేత కేసీఆర్ వచ్చే నెల 7న కామారెడ్డిలో నిర్వహించే రోడ్షోలో పాల్గొననున్నారు. భారాస ముఖ్యనేతలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొనసాగుతున్న భారాస ఎన్నికల ప్రచారం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ భారాస అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు ఓటు వేసి భారీ మెజారీటీతో గెలిపించాలని జడ్పీటీసీ మనోహర్ రెడ్డి అన్నారు. -
83 యూనిట్ల రక్త సేకరణ
[ 05-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో సమాజ సేవకులు, ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తశిబిరం విజయవంతం అయింది. -
మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా మండలంలో ప్రచారం ఉద్ధృతం చేసింది. -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాండూరు, అక్కంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. -
పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలి
[ 05-05-2024]
ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు కృషి చేయాలని జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి అన్నారు. -
పార్టీ నిర్ణయాలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలి
[ 05-05-2024]
పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ అన్నారు. -
ఏ సామాజిక వర్గం ఎటు వైపో..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
వేధింపుల కట్టడికి అంతర్గత కమిటీలు
[ 05-05-2024]
పురపాలక కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇందూరు భగభగ
[ 05-05-2024]
ఇందూరులో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో మూడు ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లాయి. -
శతశాతంతో శెభాష్ అనిపించారు
[ 05-05-2024]
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జంగంపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు. -
పల్లెలపైనే పార్టీల ఆశలు
[ 05-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో పాగావేసేందుకు భారాస, కాంగ్రెస్, భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రచారసరళిని గమనిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. -
బిల్లులు ఇవ్వకుంటే ధర్నా చేస్తా
[ 05-05-2024]
పెండింగ్లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల తర్వాత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
‘జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు’
[ 05-05-2024]
కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
‘370 సీట్లతో భాజపా మూడోసారి అధికారంలోకి’
[ 05-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 370 సీట్లతో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారం చేపట్టనుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు..!
[ 05-05-2024]
భిక్కనూరు పోలీస్స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న నలుగురు నిందితులను ప్రత్యేక పోలీసు బృందం శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పట్టపగలే దొంగలు పడ్డారు
[ 05-05-2024]
నాలుగో ఠాణా పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. అరగంట వ్యవధిలోనే ఇల్లు గుల్లచేశారు. వివరాల్లోకి వెళ్తే వినాయక్నగర్ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్ తన కుటుంబ సభ్యులతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. -
పరీక్ష రుసుము చెల్లింపునకు అవకాశం
[ 05-05-2024]
డా బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2017 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో ప్రవేశం పొందిన, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్లాగ్ పరీక్ష రుసుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి, అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త రంజిత శనివారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.200తో ఈ నెల 6 వరకు, రూ.500తో 13 వరకు అవకాశం ఉందన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ప్రశ్నించడమే నేరమా?.. 8 నెలల గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM