మాధ్యమిక విద్య మిథ్య
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది.
గణనీయంగా తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత శాతం
మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 135 విద్యార్థులకు ఒక్కరే ఉత్తీర్ణులయ్యారు.
సదాశివనగర్ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో 134 మంది విద్యార్థులకు గాను కేవలం ఆరుగురు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 160 మందికి ఐదుగురు ఉత్తీర్ణులయ్యారు.
ఈనాడు, కామారెడ్డి : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దేందుకు అధ్యాపకుల నియామకం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అధ్యాపకుల హాజరుపై పర్యవేక్షణ లోపం, నామమాత్రంగా బోధనతో ఉత్తీర్ణత తగ్గినట్లు విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో మాధ్యమిక విద్య మిథ్యగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొరవడిన సమీక్షలు
జిల్లా యంత్రాంగం కేవలం ఇంటర్ పరీక్షల నిర్వహణపై మాత్రమే సమీక్షిస్తోంది. నిబంధనల మేరకు మూడునెలలకోసారి విద్యాప్రగతి, అధ్యాపకులు, విద్యార్థుల హాజరుపై సమీక్షిస్తూ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాల విభజన అనంతరం కొత్తజిల్లాలకు పర్యవేక్షణ నిమిత్తం నోడల్ అధికారిని నియమించి ఇంటర్బోర్డు అధికారులు మమ అనిపిస్తున్నారు. పదోతరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఇంటర్కు వచ్చే సరికి గణనీయంగా తగ్గుతోంది.
నామమాత్రపు బోధనే కారణమా..?
ప్రథమ సంవత్సరంలో జిల్లాలో 8262 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4146 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం పెరగాల్సి ఉండగా తగ్గడం గమనార్హం. గత నాలుగేళ్లతో పోల్చితే ప్రస్తుతం చూచిరాతలు లేకుండా పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించారు. పరీక్షల ప్రారంభంలో సదాశివనగర్లో చూచిరాతకు ప్రోత్సహిస్తున్నారనే ఉద్దేశంతో నలుగురు అధ్యాపకులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కట్టుదిట్టంగా పరీక్షల నిర్వహణ, విద్యార్థుల్లో భయాందోళన కారణాలతో ఉత్తీర్ణత తగ్గినట్లు అనధికార సంభాషణల్లో ఇంటర్ అధ్యాపకులు చెబుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో సైతం ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గింది. ప్రభుత్వ కళాశాలల మాదిరి ఫలితాలను వెల్లడించకుండా ఇవి మాయ చేస్తున్నాయి. అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థుల సమాచారమే వెల్లడిస్తూ ఇతర ఫలితాలను దావేస్తున్నాయి. రూ.వేలల్లో రుసుంలు వసూలు చేస్తున్నా బోధన నామమాత్రమేనని ప్రస్తుత ఫలితాల్లో స్పష్టమైంది.
డిగ్రీ ప్రవేశాలపై ప్రభావం
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో 11 వేలకు పైగా సీట్లున్నాయి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో 7234 మంది విద్యార్థులకు 3204 మంది(44.29 శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇందులో కొందరు ఇంజినీరింగ్, మెడిసిన్తో పాటు ఇతరత్రా సాంకేతిక కోర్సుల్లో ప్రవేశం పొందనున్నారు. దీంతో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పడిపోయే అవకాశం ఉంది.
సమీక్ష చేస్తున్నాం
షేక్ సలాం, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంపై సమీక్ష చేస్తున్నాం. గతేడాదితో పోల్చితే ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలను తెలుసుకుంటాం. నాణ్యమైన బోధన అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. అనుత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. తక్కువ ఉత్తీర్ణత సాధించిన కళాశాలలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భాజపా మండలంలో ప్రచారం ఉద్ధృతం చేసింది. -
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తాండూరు, అక్కంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. -
పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలి
[ 05-05-2024]
ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు కృషి చేయాలని జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి అన్నారు. -
పార్టీ నిర్ణయాలకు కార్యకర్తలు కట్టుబడి ఉండాలి
[ 05-05-2024]
పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ అన్నారు. -
ఏ సామాజిక వర్గం ఎటు వైపో..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జహీరాబాద్ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
వేధింపుల కట్టడికి అంతర్గత కమిటీలు
[ 05-05-2024]
పురపాలక కార్యాలయాల్లో, పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నియంత్రించడానికి అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇందూరు భగభగ
[ 05-05-2024]
ఇందూరులో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. మే ఆరంభంలోనే ఎండ ప్రచండమైంది. జిల్లాలో మూడు ప్రాంతాలు రెడ్ జోన్లోకి వెళ్లాయి. -
శతశాతంతో శెభాష్ అనిపించారు
[ 05-05-2024]
ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జంగంపల్లి మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు 10 జీపీఏతో సత్తా చాటారు. -
పల్లెలపైనే పార్టీల ఆశలు
[ 05-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో పాగావేసేందుకు భారాస, కాంగ్రెస్, భాజపా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రచారసరళిని గమనిస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. -
బిల్లులు ఇవ్వకుంటే ధర్నా చేస్తా
[ 05-05-2024]
పెండింగ్లో ఉన్న రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ.26 కోట్లు ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల తర్వాత కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
‘జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు’
[ 05-05-2024]
కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
‘370 సీట్లతో భాజపా మూడోసారి అధికారంలోకి’
[ 05-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 370 సీట్లతో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారం చేపట్టనుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు..!
[ 05-05-2024]
భిక్కనూరు పోలీస్స్టేషన్ పరిధిలో నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తున్న నలుగురు నిందితులను ప్రత్యేక పోలీసు బృందం శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పట్టపగలే దొంగలు పడ్డారు
[ 05-05-2024]
నాలుగో ఠాణా పరిధిలో పట్టపగలే చోరీ కలకలం రేపింది. అరగంట వ్యవధిలోనే ఇల్లు గుల్లచేశారు. వివరాల్లోకి వెళ్తే వినాయక్నగర్ తుల్జా భవానీ మందిరం సమీపంలో మధుసూదన్ తన కుటుంబ సభ్యులతో శనివారం మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. -
పరీక్ష రుసుము చెల్లింపునకు అవకాశం
[ 05-05-2024]
డా బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2017 విద్యా సంవత్సరానికి ముందు డిగ్రీలో ప్రవేశం పొందిన, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు బ్యాక్లాగ్ పరీక్ష రుసుము కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి, అధ్యయన కేంద్రం ప్రాంతీయ సమన్వయకర్త రంజిత శనివారం ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుము రూ.200తో ఈ నెల 6 వరకు, రూ.500తో 13 వరకు అవకాశం ఉందన్నారు
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న