వేటగాళ్ల ఎరకు దినసరి కూలీ బలి
అడవి పందులు, ఇతర అటవీ జంతువుల కోసం పెట్టిన విద్యుత్తు తీగలు తగిలి దినసరి కూలీ బలయ్యారు. భీమ్గల్ ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. కుప్కల్ గ్రామానికి చెందిన
విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి
కుప్కల్ అటవీ ప్రాంతం నుంచి మృతదేహాన్ని తరలిస్తున్న ఎస్సై శ్రావణ్కుమార్
భీమ్గల్, న్యూస్టుడే: అడవి పందులు, ఇతర అటవీ జంతువుల కోసం పెట్టిన విద్యుత్తు తీగలు తగిలి దినసరి కూలీ బలయ్యారు. భీమ్గల్ ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. కుప్కల్ గ్రామానికి చెందిన మూడ్ బద్దు(48) అనే కూలీ గురువారం ఉదయం 4 గంటలకు వంట చెరకు కోసం అడవికి వెళ్లారు. అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన తీగలు ఆయన కాలికి తగలడంతో విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఉదయం అటువైపు వెళ్లిన పశువుల కాపరులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి, శవపరీక్షల నిమిత్తం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఆటోను ఢీకొన్న ద్విచక్ర వాహనం.. రాంచంద్రపల్లి(మాక్లూర్ గ్రామీణం): రాంచంద్రపల్లి వద్ద 63వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను గురువారం సాయంత్రం ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో జక్రాన్పల్లికి చెందిన వ్యక్తి గాయపడ్డారు. ఆయణ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మెడలో గొలుసు లాక్కుని పరారు.. నాందేడ్, న్యూస్టుడే: పొలంలో పనులు చేసుకుంటున్న మహిళ వద్దకు గురువారం ఉదయం ముసుగులు ధరించి ఇద్దరు వ్యక్తులు వచ్చి మెడలోని గొలుసులాక్కుని ద్విచక్ర వాహనంపై పారిపోయిన ఘటన జరిగింది. బోకర్ తహసీల్ కేంద్రానికి చెందిన సునితా రేడిమ్వార్ పొలంలో పని చేసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చి ఏదో అడిగినట్లు నటించి మెడలోంచి గొలుసు లాక్కున్నారు. బోకర్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు.
పిస్తోలుతో బెదిరిస్తున్న వ్యక్తి అరెస్టు.. నాందేడ్ : పిస్తోలు చూపించి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న యువకున్ని వజీరాబాద్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. పాత కౌఠ రహదారిలో సోమేష్ మదన్సింగ్ అనే యువకుడు పిస్తోలుతో వచ్చి పోయే వారిని బెదిరిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు నాలుగు దిక్కుల నుంచి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొన్నారు. పిస్తోలు స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
యువకుడి అదృశ్యం.. ధర్పల్లి, న్యూస్టుడే: మండలకేంద్రానికి చెందిన జెన్నీ రనీల్(21) బుధవారం నుంచి కనబడటం లేదని గురువారం అతని అన్నయ్య రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు.
నిందితుల కోసం గాలింపు.. నిజామాబాద్ నేరవార్తలు: నగరంలో ఇటీవల గుట్కా నిల్వలు పట్టుబడిన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి హమీద్ గురించి గాలిస్తున్నారు. కర్ణాటకలోని బీదర్లో ఉన్న మరో వ్యక్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో పోలీసులు సీరియస్గా దర్యాప్తు జరిపితే అసలు వ్యాపారులు బయటపడే అవకాశం ఉంది. గుట్కాకు కట్టడి పడాలంటే సీపీ నాగరాజు స్వయంగా పర్యవేక్షించాల్సిన అవసరముంది.
సీపీకి ఫిర్యాదు.. ఖలీల్వాడి: తొర్తిలో సాంఘిక బహిష్కరణపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై ఏర్గట్ల ఎస్సై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులు గురువారం సీపీ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభాకర్, గంగాధర్, మాణిక్యం, దేవరాం, సుమన్కుమార్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.