భూగర్భ మురుగు కాల్వల అనుసంధానానికి.. రూ.162 కోట్లతో ప్రతిపాదనలు
ఇళ్లలో నుంచి వెలువడే మురుగు రహదారిపై కనిపించొద్దని నిజామాబాద్ నగరంలో భూగర్భ మురుగు కాల్వలు నిర్మించారు. కానీ ఇంటింటికి పైపులైన్ల అనుసంధానం పూర్తి కాలేదు. దీని కోసం నగరపాలక సంస్థ ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.
న్యూస్టుడే, నిజామాబాద్ నగరం
ప్రగతినగర్లో నిర్మించిన ఛాంబర్
ఇళ్లలో నుంచి వెలువడే మురుగు రహదారిపై కనిపించొద్దని నిజామాబాద్ నగరంలో భూగర్భ మురుగు కాల్వలు నిర్మించారు. కానీ ఇంటింటికి పైపులైన్ల అనుసంధానం పూర్తి కాలేదు. దీని కోసం నగరపాలక సంస్థ ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కేటగిరీల వారీగా విభజిస్తూ కొంత రుసుం విధించినా నగరవాసుల నుంచి స్పందన రాలేదు. దీంతో సంబంధిత పనుల కోసం అమృత్ 2.0 కింద ఏప్రిల్లో రూ.162 కోట్లతో అంచనాలు రూపొందించి అధికారులు సర్కారుకు నివేదిక అందించారు. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే అనుసంధాన ప్రక్రియ పూర్తయి స్వచ్ఛ ఇందూరుకు బాటలు పడనున్నాయి.
నిజామాబాద్ నగరంలో భూగర్భ మురుగు కాల్వల నిర్మాణాన్ని రూ.230 కోట్లతో చేపట్టారు. మొదట్లో పనులు నెమ్మదిగా సాగాయి. 2018 నుంచి వేగం పుంజుకొంది. ప్రధాన దారుల్లో 12.43 కిలోమీటర్లు, అంతర్గత కాలనీల్లో 51.07 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేశారు. 2,550 వరకు మ్యాన్హోళ్లు, ఇళ్ల పక్కన ఛాంబర్లు 12,143 వరకు నిర్మించారు. ఇందుకు ప్రతిదారిని తవ్వేయడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మురుగు నీరు శుద్ధి చేసేందుకు దుబ్బ, ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లో రెండుచోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు.
దెబ్బతింటున్న నిర్మాణాలు
భూగర్భ మురుగు కాల్వ పనులు పూర్తయి ఏడాదిన్నర కావస్తోంది. ఇళ్ల పైపులైను ఛాంబర్లలో కలపాలి. అక్కడి నుంచి మురుగు రోడ్డు మధ్యలో నిర్మించిన మ్యాన్హోళ్ల ద్వారా శుద్ధికేంద్రాలకు వెళ్తుంది. ఇంటి పైపులైన్ల అనుసంధానంలో జాప్యం చోటుచేసుకుంది. ఇటు నిర్వహణ లేక కొన్నిచోట్ల ఛాంబర్లు, మ్యాన్హోళ్లు పగిలి పైకప్పులు లేచిపోయాయి. కొందరు అనధికారికంగా ఇళ్లలో నుంచి పైపులను ఛాంబర్లలోకి కలిపేసుకున్నారు. దీనివల్ల దుబ్బ ఎస్టీపీలోకి 7 ఎంఎల్డీ, ఎల్లమ్మగుట్ట ప్లాంటుకు 5 ఎంఎల్డీల మురుగు వస్తోంది. దీన్ని శుద్ధి చేసి పక్కనే ఉన్న కాల్వలోకి వదిలేస్తున్నారు.
నిధులు రాగానే పనులు
- నగేశ్రెడ్డి, డీఈ, ప్రజారోగ్య శాఖ
త్వరలోనే నిధులు వస్తాయనే నమ్మకం ఉంది. విడుదల కాగానే ఇంటింటికి పైపులైను అనుసంధానం చేపడతాం. మ్యాన్హోళ్లు, ఛాంబర్లను పగలకొడితే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం