ఖేలో ఇండియా కేంద్రం మంజూరు
అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేలా క్రీడాకారులను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందు కోసం భారత క్రీడా సంస్థ(సాయ్) ఖేలో ఇండియా ప్రాజెక్టును విడతల వారీగా ప్రారంభించింది.
న్యూస్టుడే, కామారెడ్డి క్రీడావిభాగం
కామారెడ్డిలోని బ్యాడ్మింటన్ స్టేడియం
అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేలా క్రీడాకారులను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందు కోసం భారత క్రీడా సంస్థ(సాయ్) ఖేలో ఇండియా ప్రాజెక్టును విడతల వారీగా ప్రారంభించింది. తెలంగాణలో 17 జిల్లాలకు వివిధ క్రీడాంశాలకు సంబంధించి ఖోలో ఇండియా కేంద్రాలు మంజూరు చేసింది. ఇందులో కామారెడ్డి జిల్లాకు బ్యాడ్మింటన్ దక్కింది. జిల్లా కేంద్రంలో ఇప్పటికే నడుస్తున్న బ్యాడ్మింటన్ అకాడమీలోనే నిర్వహించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీని నిర్వహణకు 2020లోనే దరఖాస్తులు స్వీకరించగా చాలా మంది పోటీపడ్డారు. చివరకు బ్యాడ్మింటన్ అకాడమీనే సాయ్ ఎంపిక చేసింది. జిల్లా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పర్యవేక్షణ బాధ్యతలు
ఖేలో ఇండియా కేంద్రాన్ని సాయ్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ దాని పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ(డీఎస్ఏ), రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(శాట్స్)కు అప్పగించారు. అకాడమీ నిర్వాహకులు, అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులను శిక్షకులుగా నియమించి ఉపాధి అవకాశం కల్పిస్తారు. నిర్వహణ నిధులను కేంద్ర ప్రభుత్వమే విడుదల చేస్తుంది. ఏడాదికి రూ.5 లక్షలు, శిక్షకుడికి రూ.3 లక్షలు చెల్లిస్తారు. క్రీడా పరికరాలు పంపిణీ చేస్తారు.
ఆధునిక ఇండోర్ స్టేడియం
జిల్లా కేంద్రానికి చెందిన జాతీయ క్రీడాకారుడు సందీప్గౌడ్ ఆధునిక హంగులతో బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలనే ఆయన కల వసతుల లేమి కారణంగా నెరవేర్చుకోలేకపోయారు. తనలా మరో క్రీడాకారుడికి కాకూడదనే ఉద్దేశంతో కామారెడ్డిలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం నిర్మించారు. ఇందులో రెండు వుడెన్(చెక్క) కోర్డులు ఉన్నాయి. స్వయంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కొందరు పేద పిల్లలకు ఉచితంగా నేర్పుతున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది విద్యార్థులు జాతీయస్థాయి టోర్నీలు ఆడారు. ఖేలో ఇండియా కేంద్రం కోసం దరఖాస్తు చేసుకోవడంతో మంజూరైంది.
ఖరీదైన పరికరాలు
బ్యాడ్మింటన్ క్రీడ చాలా ఖరీదైంది. వుడెన్ కోర్టులు, రాకెట్లు, మ్యాట్లు, దుస్తులు, బూట్లు వంటి వాటికి వేల రూపాయలు వెచ్చించాలి. ఖేలో ఇండియా కేంద్రం మంజూరవ్వడంతో క్రీడాకారులకు ఇవన్నీ సమకూరే అవకాశం ఉంది.
చాలా ఆనందంగా ఉంది
- సందీప్గౌడ్, బ్యాడ్మింటన్ శిక్షకుడు
నా అకాడమీనే ఖేలో ఇండియా కేంద్రంగా నడపడానికి సాయ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో ఖర్చుతో ఈ కేంద్రాన్ని నడుపుతున్నా. ఈ ప్రకటన చాలా ఆనందంగా ఉంది. దేశం గర్వించేలా క్రీడాకారులను తయారు చేస్తా.
మార్గదర్శకాలు రావాలి
దామోదర్రెడ్డి, జిల్లా క్రీడల అధికారి, కామారెడ్డి
జిల్లాకు బ్యాడ్మింటన్ ఖేలో ఇండియా కేంద్రం మంజూరైంది. స్థానికంగా ఉన్న అకాడమీనే ఎంపిక చేశారు. మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మరింత స్పష్టత వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికల వేళ జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 25-04-2024]
సీపీఎం కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. -
ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీ
[ 25-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
భాజపా ఎన్నికల ప్రచారం
[ 25-04-2024]
ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. -
ఓటే వజ్రాయుధం
[ 25-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
6 గ్యారంటీ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయి
[ 25-04-2024]
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెత్కర్ కు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇంటర్లో అమ్మాయిలదే పైచేయి
[ 25-04-2024]
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నిజామాబాద్ 27వ స్థానంలో, ద్వితీయంలో 29వ స్థానంలో నిలిచింది. -
సమాయత్తం.. ఓట్లపైనే చిత్తం
[ 25-04-2024]
లోక్సభ నామినేషన్ల పర్వానికి నేటితో తెరపడనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే తమ నామ పత్రాలు దాఖలు చేశారు. -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఫిర్యాదులపై పెరిగిన చైతన్యం
[ 25-04-2024]
ఎన్నికల నియమాలు, ఉల్లంఘనలపై పౌరుల్లో చైతన్యం పెరిగింది. ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల్ కమిషన్ 1950 కాల్సెంటర్, సీ-విజిల్ యాప్ను రూపొందించిన విషయం తెలిసిందే -
రాష్ట్రంలో చివరి స్థానం
[ 25-04-2024]
కామారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయిలో జిల్లా అట్టడుగు స్థాయికి పడిపోయింది. 35వ స్థానంలో నిలిచింది. -
ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాసం
[ 25-04-2024]
ఎల్లారెడ్డి బల్దియాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. -
కళాశాలల తనిఖీలకు వేళాయె
[ 25-04-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 2024-25 నూతన విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ కోసం ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల తనిఖీలు గురువారం నుంచి చేపట్టనున్నారు. -
కోడ్ ముగిశాకే.. సవరణకు అవకాశం
[ 25-04-2024]
ఎన్నికల కోడ్ రాకముందే ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. -
అదరగొట్టారు..
[ 25-04-2024]
కుటుంబ నేపథ్యం ఏదైనా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని అహర్నిశలు కష్టపడ్డారు. నిపుణుల వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రణాళికబద్ధంగా చదివారు. పరీక్షలు రాశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ