logo

భాజపా ఎన్నికల ప్రచారం

ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు.

Published : 25 Apr 2024 17:40 IST

ఎల్లారెడ్డి పట్టణం: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలోని లక్ష్మాపూర్, అడివిలింగాల్ తాండలలోని ప్రతి గడప గడప కు తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి భాజపా అభ్యర్థి బీబీ పాటిల్‌ను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సెన్సార్ బోర్డుమెంబర్  రామకృష్ణ, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి గణేష్, అసెంబ్లీ ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జి నరేష్ నాయక్, రాజు తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని