నిధులు లేక.. నిలిచిన భూ సేకరణ
జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నత్తనడకన సాగునీటి పథకాల పనులు
ప్యాకేజీ 22లో సొరంగం నిర్మాణం
ఈనాడు, కామారెడ్డి, నిజాంసాగర్, న్యూస్టుడే: జిల్లాలోని సాగునీటి పథకాల నిర్మాణాలకు నిధుల విడుదలలో జాప్యంతో భూ సేకరణ నిలిచిపోయింది. కాళేశ్వరం ప్యాకేజీ-22 పనులతో పాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాకు గోదావరి జలాలు తరలించే ప్యాకేజీ-22 పనులను గుత్తేదారు తాత్కాలికంగా నిలిపివేశారు. కాలువల తవ్వకాలతో పాటు ఇతరత్రా పనులు చేపట్టడానికి అవసరమైన భూ సేకరణకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరముంది.
బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో..
కాళేశ్వరం జలాశయం నుంచి నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, మెదక్ జిల్లాలకు నీరందించేందుకు ప్యాకేజీ-20, 21, 22 కింద పనులు చేపట్టాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలించేందుకు ప్రారంభించిన 22-ప్యాకేజీ పనులు పూర్తికాలేదు. కాలువల తవ్వకాలతో పాటు ఇతర పనులకు పెద్దఎత్తున భూ సేకరణ చేయాలి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు.
నాగమడుగు ఎత్తిపోతలపై పట్టింపు కరవు
జుక్కల్ నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు నిజాంసాగర్ దిగువన నాగమడుగు వద్ద రూ.476.25 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులను మూడేళ్ల కిందట ప్రారంభించారు. ఇప్పటికీ 5 శాతం పనులు పూర్తికాలేదు. పథకాన్ని రీడిజైన్ చేసి మరో 10 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించినా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. దీనికి తోడు నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు నామమాత్రంగా పనులు చేపడుతున్నారు. పంప్హౌస్ నిర్మించే ప్రాంతంలో కరకట్టలు, కాలువల నిర్మాణాలకు భూ సేకరణ చేయాల్సి ఉంది. రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసినప్పటికీ నిధుల లేమితో అడుగు ముందుకు పడడం లేదు.
సాధ్యాసాధ్యాల పరిశీలన అవసరం..
గోదావరి జలాలను జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేస్తామన్న గత పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో జిల్లాకు సాగునీరందించడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాల్సిన అవసరముంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాగునీటి పారుదల శాఖ అధికారులు ఎగువ మానేరు నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు నీరు తరలించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం ప్యాకేజీ-22 పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. ఎగువ మానేరు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును పట్టాలెక్కిస్తేనే గోదావరి జలాల తరలింపు సాధ్యమయ్యే అవకాశాలున్నాయి.
నాయకుల చొరవ కావాలి
ప్రభుత్వం ప్యాకేజీ-22తోపాటు నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులతోపాటు భూ సేకరణపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరముంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటేనే సాగునీటి పథకాలకు మోక్షం లభించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ వార్డు కమిటీ ఎన్నిక
[ 27-04-2024]
ఎల్లారెడ్డి పురపాలక 11వ వార్డు లింగరెడ్డిపేట కాంగ్రెస్ నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పట్టణ అధ్యక్షుడు వినోద్ గౌడ్ తెలిపారు, -
గడప గడపకు కాంగ్రెస్
[ 27-04-2024]
మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెత్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు శనివారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్