నిజామాబాద్ బరిలో 29 మంది
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో పది మందివి తిరస్కరణకు గురయ్యాయి.
ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్
నిజామాబాద్ కలెక్టరేట్, న్యూస్టుడే: నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో పది మందివి తిరస్కరణకు గురయ్యాయి. 32 మంది ఉండగా సోమవారం ముగ్గురు స్వతంత్రులు ఉప సంహరించుకోవడంతో 29 మంది పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు వెల్లడించారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా గుర్తులు కేటాయించినట్లు తెలిపారు.
అభ్యర్థులు వీరే
ధర్మపురి అర్వింద్(భాజపా), బాజిరెడ్డి గోవర్ధన్(భారాస), తాటిపర్తి జీవన్రెడ్డి(కాంగ్రెస్), లింబాద్రి(బీఎస్పీ), అశోక్గౌడ్(బహుజన లెఫ్ట్ ఫ్రంట్), అలీ మన్సూర్(అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్), సుమన్(డీఎస్పీ), సాయి కృష్ణమూర్తి(యుగ తులసీ), నగేష్(దళిత బహుజన), దేవతి శ్రీనివాస్(బహుజన ముక్తి), భూక్యా నందు(విద్యార్థుల రాజకీయ పార్టీ), రాజ్ కుమార్(ఇండియా ప్రజాబంధు), యోగేందర్(అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్స్ పార్టీ), ఆరె రాజేందర్, కొత్తకొండ శక్తిప్రసాద్, కోటగిరి శ్రీనివాస్, గంట చరితారావు, గోపి చంద్రయ్య, జీవన్రెడ్డి, లక్ష్మీనారాయణ, బీబీనాయక్, సాయినిఖిల్, ప్రశాంత్, మలావత్ విఠల్, రాగి అనిల్, రాపల్లి సత్యనారాయణ, రేపల్లి శ్రీనివాస్, విక్రమ్రెడ్డి, సయ్యద్ అస్గర్(స్వతంత్రులు) బరిలో ఉన్నారు.
రెండు ఈవీఎంలు అవసరం
ఎక్కువ మంది బరిలో ఉండడంతో రెండు ఈవీఎంలు తప్పనిసరైంది. బ్యాలెట్ యూనిట్లో నోటాతో కలిపి 16 గుర్తులుంటాయి. బరిలో 29 మంది ఉండటంతో ప్రతి పోలింగ్ బూత్లో రెండు చొప్పున బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. అదనపు యంత్రాలు తెప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు, చిత్రంలో అదనపు పాలనాధికారి అంకిత్, సాధారణ పరిశీలకురాలు ఎలిస్వజ్,
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు పంటకు జై
[ 21-05-2024]
తొలకరి రాగానే జూన్ మొదటి వారంలోనే పసుపు విత్తడం ఆరంభమవుతుంది. రైతులు ఇప్పటికే దుక్కిలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. -
మట్టి.. కనిపెట్టి
[ 21-05-2024]
ఎండాకాలం వచ్చిందంటే చాలు పొడి దుక్కుల సమయంలో మట్టి నమూనాలు సేకరించడం ఒక్కప్పుడు ఆనవాయితీగా ఉండేది. -
టెట్ ప్రారంభం
[ 21-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2024 రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు దశల్లో జూన్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. -
చరిత్ర శిథిలం.. పాలకులూ.. పట్టించుకోరా..
[ 21-05-2024]
నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమయ్యే వరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు ఎన్నో ఉద్యమాలు చేశారు. -
నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి
[ 21-05-2024]
మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని పాలనాధికారి జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఫలితాలు మెరుగయ్యేనా..?
[ 21-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి ఇంటర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అట్టడుగుస్థాయికి పడిపోయింది. -
ఆరోగ్యశ్రీలో అడ్డదారులు
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త ఏడాదిన్నర క్రితం ఎడపల్లి పీహెచ్సీ వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో వెళ్లిపోయారు. మహబూబ్నగర్కు చెందిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ స్వప్నకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. -
సదరం స్లాట్.. ఇక నిరంతరం
[ 21-05-2024]
అర్హులైన దివ్యాంగులు తగిన ధ్రువపత్రాలతో ఎప్పుడైనా మీ-సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఇప్పటి వరకు ప్రతి నెలా రెండు, నాలుగో వారాల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. -
ఓపెన్ జిమ్ను సందర్శించిన బల్దియా ఛైర్పర్సన్
[ 21-05-2024]
జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు ప్రాంతంలోని ఓపెన్జిమ్ను పురపాలక ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ సోమవారం సందర్శించారు. -
ప్రగతి పరిశీలన..
[ 21-05-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతి పనులు, సంక్షేమ పథకాలు పల్లెల్లో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిపై సమగ్ర సమాచారం సేకరించి నివేదిక రూపొందించే నిమిత్తం ఎంసీహెచ్ఆర్డీ యంత్రాంగం రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టాలని నిర్ణయించింది.