మంచానికే పరిమితమైనా.. అందని పింఛను
‘మా అబ్బాయికి చదువంటే చాలా ఇష్టం. గుర్తు తెలియని వ్యాధితో నడుము నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయాయి. వైద్యానికి చేతిలో డబ్బు లేదు. ఉన్నత వైద్యం అందించి ఆదుకోవాలి’ ఇది ఓ తండ్రి ఆవేదన.
బాలుడికి సపర్యలు చేస్తున్న తల్లి
గుణుపురం, నూస్టుడే: ‘మా అబ్బాయికి చదువంటే చాలా ఇష్టం. గుర్తు తెలియని వ్యాధితో నడుము నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయాయి. వైద్యానికి చేతిలో డబ్బు లేదు. ఉన్నత వైద్యం అందించి ఆదుకోవాలి’ ఇది ఓ తండ్రి ఆవేదన. గుణుపురం సమితిలోని డొంబుసొరా గ్రామానికి చెందిన మీనకేతన సబర కుమారుడు విభూతి సబర నాలుగేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. బాలుడి తల్లిదండ్రులు రోజూ కూలికి వెళ్తే గాని పూట గడవదు. విభూతి గొడియాబంద గ్రామంలోని మేనమామ ఇంట్లో ఉంటూ అయిదో తరగతి వరకు చదివాడు. అయిదో తరగతి చదువుతున్న సమయంలో కాళ్లు, చేతుల నొప్పులు రావడంతోపాటు నడవలేకపోయాడు. వెంటనే గుణుపురం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అనంతరం బ్రహ్మపుర పెద్దాసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఇటీవల గుణుపురంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టరు స్వాధాదేవ్ సింగ్కు వినతిపత్రం అందజేశారు. కనీసం పింఛను కూడా అందడం లేదని బాలుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయమై గుణుపురం బీడీఓ శాంతిప్రభా ప్రధాన్తో మాట్లాడగా ఆ కుటుంబానికి తమ వంతు సహకారం అందిస్తామని, బాలుడికి దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, మూడు చక్రాల సైకిల్ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా వైద్యాధికారితో మాట్లాడి ఉన్నత వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్