ఓయూఏటీకి మహర్దశ
భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయానికి (ఓయూఏటీ) మహర్దశ రానుంది. ప్రభుత్వం ఈ వర్సిటీ విస్తరణ, ఆధునికీకరణ పనులకు రూ.727 కోట్లు కేటాయించింది.
రూ.727 కోట్లతో విస్తరణ, ఆధునికీకరణ పనులు
ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం
భువనేశ్వర్, న్యూస్టుడే: భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయానికి (ఓయూఏటీ) మహర్దశ రానుంది. ప్రభుత్వం ఈ వర్సిటీ విస్తరణ, ఆధునికీకరణ పనులకు రూ.727 కోట్లు కేటాయించింది. నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభం కాగా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్, వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద పాఢితో కలిసి గురువారం రాత్రి ఓయూఏటీ క్యాంపస్ను సందర్శించారు.
రైతులకు వెన్నుదన్నుగా...
రైతుల ప్రయోజనాలు, వ్యవసాయ పరిశోధనలు, వ్యవసాయ, సాంకేతిక విద్యార్ధుల ఉజ్వల భవిత ధ్యేయంగా 1962లో భువనేశ్వర్ సూర్యనగర్ ప్రాంతంలో ఓయూఏటీ ఏర్పాటైంది. ఇక్కడ వ్యవసాయ, సాంకేతిక డిగ్రీ, పీజీ విద్యతోపాటు అన్నదాతలకు ఉపయుక్తమైన పరిశోధనలు, విత్తనాల ఉత్పత్తి, కొత్త ప్రయోగాలు చేస్తారు. రైతులకిక్కడ శిక్షణ ఇస్తారు. విపత్తుల వేళల్లో పంట సంరక్షణ, చీడపడితే ఎలా నివారించాలన్న దానిపై నిపుణులు సూచనలిస్తారు. ఓయూఏటీ ఆధీనంలో ఉత్తరకోస్తా, దక్షిణ, పశ్చిమ ఒడిశా ప్రాంతాల్లో ప్రాంతీయ వ్యవసాయ కేంద్రాలున్నాయి.
గర్వకారణమవుతుంది
ఓయూఏటీ వీసీ ప్రభాత కుమార్ విలేకరులతో మాట్లాడుతూ... భారతదేశంలో ఈ వర్సీటీ గర్వకారణమవుతుందని చెప్పారు. నూతన నిర్మాణాలు పూర్తయినే వ్యవసాయ శాస్త్రానికి సంబంధించి మరిన్ని కొత్త కోర్సులు ప్రారంభించాలన్న ధ్యేయంతో ఉన్నామన్నారు. పరిశోధనలు ముమ్మరమవుతాయని, విదేశాల నుంచి విజిటింగ్ ఆచార్యులొస్తారని తెలిపారు. అన్నదాతలకు వర్సిటీలో వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వ్యవసాయం ఉత్పత్తులు పెంచడానికి నిరంతర కృషి జరుగుతోందన్నారు.
సీఎం సందర్శన తర్వాత
గతేడాది నవీన్ ఓయూఏటీని సందర్శించిన తర్వాత విస్తరణ, ఆధునికీకరణ పనులకు నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. రూ.60 కోట్ల వ్యయంతో రైతుల కోసం వెయ్యి సీట్ల ఆడిటోరియం, విద్యార్థుల వసతి గృహాలు, 11 వ్యవసాయ, 3 సాంకేతిక విభాగాల అదనపు భవనాలు, పాలనా కేంద్రం విస్తరణకు ధ్యేయంగా పెట్టుకున్నారు. నిర్మాణ రంగంలో విశేష అనుభవం గల కంపెనీకి పనులు కేటాయించారు. ఈ ఏడాది చివరినాటికల్లా ఈ నిర్మాణాలు పూర్తి చేసి 2024 జనవరి 1న ప్రారంభించాలని నిర్ణయించారు.
పనుల్లో నాణ్యత ఉండాలి
ఓయూఏటీ క్యాంపస్ సందర్శించిన పాండ్యన్ ఉపకులపతి (వీసీ) ఆచార్య ప్రభాత కుమార్ రౌళో, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. పనుల్లో నాణ్యత ఉండాలని, నిర్ణీత వ్యవధిలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్సీటీ ఆచార్యులు, విద్యార్థులతో మాట్లాడారు.
విశ్వవిద్యాలయం సిబ్బందితో పాండ్యన్, అరవింద పాఢి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్