ప్రజా చైతన్యంతోనే క్యాన్సర్ నుంచి విముక్తి
పొగాకు ఉత్పత్తుల వినియోగానికి అంతా దూరంగా ఉండాలని, ప్రజా చైతన్యంతోనే క్యాన్సర్ నుంచి విముక్తి సాధ్యమని అతిథులు పేర్కొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బిక్రం పండా. చిత్రంలో ఇతర అతిథులు, నిర్వాహకులు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: పొగాకు ఉత్పత్తుల వినియోగానికి అంతా దూరంగా ఉండాలని, ప్రజా చైతన్యంతోనే క్యాన్సర్ నుంచి విముక్తి సాధ్యమని అతిథులు పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్థానిక సామాజిక, సాంస్కృతిక, క్రీడా సంస్థ ‘క్రాంతి’ ఆధ్వర్యంలో శనివారం చైతన్య సమావేశం, భారీ పాదయాత్ర నిర్వహించారు. ఉదయం స్థానిక కళ్లికోట వర్సిటీ మైదానంలో నిర్వహించిన సమావేశానికి బ్రహ్మపుర ఎమ్మెల్యే బిక్రంకుమార్ పండా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అతిథులుగా బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి, కళ్లికోట వర్సిటీ వీసీ ఆచార్య ప్రఫుల్ల కుమార్ మహంతి, బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం., కార్పొరేటరు సంజిత్ పాణిగ్రహి, ఎస్ఎంఐటీ విద్యాసంస్థల అధ్యక్షుడు భగవాన్ గంతాయత్, సంతోష్ కుమార్ జెనా, సుశాంత సాబత్, దీపక్కుమార్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ సంస్థలకు చెందిన వందలాది మందితో పాదయాత్ర నిర్వహించారు. దీనికి అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగిన పాదయాత్ర తిరిగి కళ్లికోట వర్సిటీ మైదానంలో ముగిసింది. నిర్వాహక ‘క్రాంతి’ కార్యనిర్వాహక సంచాలకుడు దేవానంద దాస్, ఇతర ప్రతినిధులు సంజయ్ కుమార్ రథ్, నిర్మలా దాస్, దేవరాజ్ రౌత్, సరోజ్ సాహు, స్నిగ్ధ మహరణా తదితరులు కార్యక్రమాల్ని పర్యవేక్షించారు.
పాదయాత్రలో పాల్గొన్న వివిధ విద్యాసంస్థల విద్యార్థులు తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జంపివాణి కేసులో నిందితుడికి ఉరిశిక్ష
[ 26-04-2024]
మ్యుచుండే వయగఢ్ జిల్లా ఏడీజేఎంకేలో 2019లో జరిగిన జంపి వాణి కేసులో శుక్రవారం తీర్పు వెల్లడించారు. -
నీటిలో మునిగి ఇద్దరు బాలికలు మృతి
[ 26-04-2024]
జిల్లాలోని గేప్ సమితిలోని మథని గ్రామంలో శుక్రవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. -
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్