ప్రజలపై దౌర్జన్యాలు చేస్తున్నారనే మాజీ మంత్రి హత్య
మాజీ మంత్రి నబకిశోర్ దాస్ను హతమార్చేందుకు మాజీ ఏఎస్ఐ గోపాల్చంద్ర దాస్ ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
నిందితుడు గోపాలచంద్ర దాస్ వెల్లడి
కటక్, న్యూస్టుడే: మాజీ మంత్రి నబకిశోర్ దాస్ను హతమార్చేందుకు మాజీ ఏఎస్ఐ గోపాల్చంద్ర దాస్ ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. అధికారులు నిందితుడ్ని రిమాండ్లోకి తీసుకుని విచారిస్తున్నారు. రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నేతలు ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వీరిలో నబకిశోర్ దాస్ కూడా ఉన్నారని, అందుకే ఆయనను హత్య చేశానని దర్యాప్తులో గోపాల్చంద్ర దాస్ తెలిపినట్లు అధికారులు చెప్పారు. 2022 సెప్టెంబరు 18న పట్టణంలో నువఖాయి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారని, ఆరోజు వర్షం కురవడంతో ఎక్కువమంది ప్రజలు రాలేదని, ఆ సమయంలో ఆయనను హతమార్చేందుకు ప్రయత్నించానని, మంత్రి దూరంగా ఉండడంతో అవకాశం లభించలేదని ఆయన అధికారులకు చెప్పాడు. అదే ఏడాది డిసెంబరు 30న పట్టణంలో ప్రముఖల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కూడా నబకిశోర్ దాస్ను హత్య చేయాలని ప్లాన్ చేశానని, అప్పుడు కూడా ఆయన తనకు దూరంగా ఉండడంతో సాధ్యం కాలేదని నిందితుడు చెప్పాడు. మరికొన్నిసార్లు ప్రయత్నం చేసి చివరికి జనవరి 29న మంత్రి దగ్గరగా కనిపించడంతో కాల్పులు జరిపినట్లు గోపాల్దాస్ తెలిపినట్లు క్రైమ్ బ్రాంచి అధికారులు వివరించారు.
ఠాణాధికారి విఫలం.. సాధారణంగా మంత్రులు, వీఐపీలు పట్టణంలోకి వస్తే స్థానిక ఠాణాధికారి వారి వెంట ఉంటారు. కారు నుంచి సభాస్థలి వరకు వారిని దగ్గరుండి తీసుకెళ్లి తీసుకు వస్తుంటారు. మాజీ మంత్రి హత్య జరిగిన రోజున అప్పటి ఠాణా అధికారి ప్రద్యుమ్నకుమార్ స్వయ్ మంత్రి వద్దకు రాలేదు. ఆయనకు దూరంగా నిలుచున్నాడు. కాల్పులు జరిగిన అనంతరం అధికారి గోపాల్చంద్ర దాస్ వద్దకు చేరుకొని పిస్టల్ను లాక్కున్నాడు. ఆరు మాసాలుగా నిందితుడు మాజీ మంత్రి హత్యకు ప్రయత్నిస్తుంటే ఎందుకు ఠాణాధికారి తెలుసుకోలేకపోయారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రానికి నా హయాంలో రూ.మూడున్నర లక్షల కోట్ల సాయం
[ 07-05-2024]
తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒడిశా రాష్ట్రానికి రూ.మూడున్నర లక్షల కోట్లు సాయంగా అందించినట్లు నరేంద్రమోదీ వివరించారు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ హయాంలో రూ. లక్ష కోట్లే ఇచ్చారని పేర్కొన్నారు. -
సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయం
[ 07-05-2024]
సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయమని, చెప్పింది చేయడానికి కట్టుబడి ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పరని, అందుకు ఆయన గ్యారంటీని ప్రజలు విశ్వసిస్తున్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. -
పగటి కలలు కంటున్న భాజపా: సీఎం
[ 07-05-2024]
విపక్షంలో ఉన్న భాజపా అధికారంలోకి రావాలని కలలు కంటోందని, ఇది నెరవేరదని, రాష్ట్ర ప్రజలు బిజదను మళ్లీ ఆదరిస్తారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
కొరాపుట్ ఎవరికి సొంతం?
[ 07-05-2024]
కొరాపుట్, రాయగడ జిల్లాల్లో ప్రతిష్ఠాత్మక కొరాపుట్ లోక్సభ స్థానంలో విజయంపై అందరి దృష్టి పడింది. ఇక్కడ కాంగ్రెస్, బిజద, భాజపాల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉండగా, విజయం ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది. -
ప్రచారం జోరు
[ 07-05-2024]
సాధారణ ఎన్నికల పోలింగు తేదీ దగ్గరపడుతుండగా, బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రచారం జోరును మరింత పెంచారు. -
భాజపా సీఎం ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు
[ 07-05-2024]
రాష్ట్రంలో భాజపా అధికారానికి వస్తుందని, సీఎం ఎవర్నది ప్రజలు నిర్ణయిస్తారని కేంద్రమంత్రి, సంబల్పూర్ లోక్సభ అభ్యర్థి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. -
భువనేశ్వర్లో దిగలేకపోయిన సీఎం హెలికాప్టరు
[ 07-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం ఉదయం 10.30 గంటలకు భవానీపాట్నా, ఖరియర్లలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు భువనేశ్వర్ బయలుదేరిన... -
ప్రచారానికి ‘సినీ గ్లామర్’
[ 07-05-2024]
విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న గోపాల్పూర్ బిజద అభ్యర్థి బిక్రం పండా సోమవారం సినీతారలతో కలిసి రోడ్షో, పాదయాత్రలు నిర్వహించారు. -
నేడు నాలుగో విడతకు నోటిఫికేషన్
[ 07-05-2024]
రాష్ట్రంలో నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. తుది విడతగా జూన్ 1న మయూర్భంజ్, జాజ్పూర్, జగత్సింగ్పూర్, భద్రక్, బాలేశ్వర్, కేంద్రపడ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 42 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య