తండ్రి ‘హస్తం’ కాదని... ‘శంఖం’ పిడికిట పట్టుకొని..
సీనియర్ కాంగ్రెస్ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు.
బిజద గూటికి సురేష్ రౌత్రాయి కొడుకు
శంఖ భవన్లో ఎంపీల సమక్షంలో మన్మథ రౌత్రాయి
భువనేశ్వర్, న్యూస్టుడే: సీనియర్ కాంగ్రెస్ నేత, ఖుర్దా జిల్లా జట్నీ ఎమ్మెల్యే సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు కెప్టెన్ మన్మధ రౌత్రాయి బుధవారం బిజదలో చేరారు. వేలాదిమంది మద్దతుదారులతో ర్యాలీగా భువనేశ్వర్లోని శంఖ భవన్ (బిజద కార్యాలయం)కు చేరుకున్న ఆయనకు రాజ్యసభ సభ్యులు మానస్ మంగరాజ్, సస్మిత్ పాత్ర్, సులతదేవ్ తదితర నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కండువా ధరింపజేశారు. తర్వాత నవీన్ నివాస్కు వెళ్లి సీఎం ఆశీస్సులు పొందారు.
గతేడాది ఉద్యోగానికి రాజీనామా
వాయుసేనలో కెప్టెన్గా విధులు నిర్వహించిన మన్మధ గతేడాది వీఆర్ఎస్ తీసుకున్నారు. రాజకీయాల్లో చేరతానని ప్రకటించారు. 80 వసంతాలు దాటిన తాను 2024 ఎన్నికల్లో పోటీ చేయనని, తన రెండో కుమారుడు మన్మధ కాంగ్రెస్ అభ్యర్థిగా జట్నీ నుంచి పోటీ చేస్తారని ఆయన తండ్రి సురేష్ రౌత్రాయి ఇటీవల చెప్పారు. ఇంతలోనే ఈ మార్పు జరగడం విశేషం.
అమెరికా నుంచి పెద్ద కొడుకు రాక
ఇంతలో సురేష్ పెద్దకుమారుడు సిద్ధార్థ రౌత్రాయి అమెరికాలో ఉద్యోగం వదులుకొని జట్నీ వచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయన పూరీ జిల్లా నిమపడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఇద్దరు కుమారుల విజయానికి తాను ప్రచారం చేస్తానని సురేష్ పేర్కొన్నారు. సిద్ధార్థ అత్తవారిల్లు నిమపడ కావడంతో అక్కడి నుంచి ఆయనను పోటీకి దింపాలని సురేష్ రౌత్రాయ్ వివరించారు. ఏఐసీసీకి దీనిపై తెలియజేశానని ఇద్దరు కుమారులు ఆ పార్టీ అభ్యర్థులవుతారన్నారు.
ఉద్దేశపూర్వకమా... వాస్తవమా...
మన్మధ తండ్రితో ఏకీభవించలేదు. కాంగ్రెస్లో చేరడానికి సుముఖత చూపలేదు. బిజదకు దగ్గరయ్యారు. ఆ పార్టీ నేతలతో సంప్రదించారు. మద్దతుదారులను కూడగట్టారు. ఈ నేపథ్యంలో చిన్న కుమారుడు బిజదకు దగ్గరయ్యారని, ఆయన మేజరని, తన అభిరుచిని గౌరవించాల్సి వస్తోందన్నారు. పెద్దకుమారుడు సిద్ధార్థ తన మాట జవదాటకుండా నిమపడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి సన్నద్ధంగా ఉన్నట్లు సురేష్ చెప్పుకున్నారు.
మన్మధకు భువనేశ్వర్ టిక్కెట్టు
కెప్టెన్ మన్మధ బిజదలో చేరిన రెండు గంటల వ్యవధిలో పార్టీ టికెట్టు ఖాయమైంది. భువనేశ్వర్ లోక్సభ స్థానానికి ఆయనను అభ్యర్థిగా చేసినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
అపరాజితతో ఢీ
భువనేశ్వర్ లోక్సభ స్థానానికి ఎంపీ అపరాజిత షడంగి భాజపా అభ్యర్థి కాగా, కెప్టెన్ మన్మధ రౌత్రాయి బిజద తరఫున పోటీ చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
[ 27-04-2024]
విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని బేతర్ సింగ్ గ్రామంలో జరిగింది. -
పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత
[ 27-04-2024]
పాము కాటుతో వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. గజపతి జిల్లా మోహన సమితి అడవా ఠాణా పరిధిలోని జిలికి గ్రామంలో శంకర్ ప్రధాన్ (30) శుక్రవారం రాత్రి మలవిసర్జనకు బయటికి వెళ్లాడు. -
గజపతి సేవలు చిరస్మరణీయం: నవీన్
[ 27-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహారాజా కృష్ణచంద్ర గజపతి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్ర ప్రజలకు ఆయన మార్గదర్శిగా నిలిచారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. -
కాంగ్రెస్కు పూర్వవైభవం దక్కేనా
[ 27-04-2024]
కొరాపుట్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి. -
హింజిలికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి
[ 27-04-2024]
‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సవాల్ విసిరారు. -
ధర్మేంద్ర మాతృభూమికి చేసిందేమిటి?
[ 27-04-2024]
స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్పూర్ లోక్సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి) పేర్కొన్నారు. -
5 లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్
[ 27-04-2024]
రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
రాయగడ జిల్లాలో 62 నామినేషన్లు
[ 27-04-2024]
జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
[ 27-04-2024]
కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. -
నాడు బిజద.. నేడు భాజపా
[ 27-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
బిజదలో చేరికలు
[ 27-04-2024]
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే