ఇన్నాళ్లు ఏమయ్యారు?.. మా సమస్యలపై ఏం చేశారు?
అభివృద్ధే అజెండాగా చేసుకున్నామని, తమకే ఓట్లేయండని ప్రచారానికి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆయాచోట్ల ఓటర్లు నిలదీస్తున్నారు.
నిలదీస్తున్న ఓటర్లు... తడబడుతున్న నేతలు
నువాపడలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో శరత్ పాదయాత్ర
భువనేశ్వర్, న్యూస్టుడే : అభివృద్ధే అజెండాగా చేసుకున్నామని, తమకే ఓట్లేయండని ప్రచారానికి దిగిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆయాచోట్ల ఓటర్లు నిలదీస్తున్నారు. గడిచిన అయిదేళ్లు వారంతా ఎక్కడున్నారని? తమ ప్రాంతాలకు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం చాలాచోట్ల ఇలాంటి దృశ్యాలు కనిపించాయి.
ఎందుకు ముఖం చాటేశారు?
సుందర్గఢ్ లోక్సభ స్థానానికి బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్న హాకీ క్రీడాకారుడు దిలీప్ తిర్కీ రాజ్గంగపూర్లో పాదయాత్ర నిర్వహించారు. నవీన్ పట్నాయక్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు. ఇంతలో గడిచిన అయిదేళ్లు తమరు ఈ ప్రాంతానికి ఎందుకు రాలేదని స్థానికులు ప్రశ్నించారు. రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలోనూ ముఖం చాటేశారని, తమ ఇబ్బందులు ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని నిలదీశారు. సమాధానం చెప్పుకోవడానికి తడబడిన తిర్కీ ఇకపై వారికి తోడునీడగా ఉంటానని సర్దిచెప్పారు.
పూరీకి ఎన్నిసార్లు వచ్చారు?
పూరీ లోక్సభ స్థానానికి బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఐపీఎస్ మాజీ అధికారి అరూప్ పట్నాయక్కు పూరీ బొడొదండోలో చేదు అనుభవం ఎదురైంది. పూరీ తన జన్మస్థలం అంటు చెప్పుకుంటున్న మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారని ఓటర్లు ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులపై మీకు అవగాహన ఉందా అని అడిగారు. దీంతో అరూప్ పట్నాయక్ నీళ్లు నమిలారు.
రహదారి పనులు ఇన్నాళ్లా?
55వ నెంబరు రహదారి పనులు నత్తనడక సాగుతున్న విషయం తెలిసినా ఎందుకు పట్టించుకోలేదని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు కుచిండ వాసులు ప్రశ్నించారు. కటక్-సంబల్పూర్ రహదారి పనుల జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతే కారణమని, స్థల సేకరణ, అటవీశాఖ క్లియరెన్సు ఇవ్వడంలో జాప్యమైందని ధర్మేంద్ర తెలియజేశారు. ఆయన సంబల్పూర్ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
మీది ఉత్తర కోస్తా కదా
సంబల్పూర్ లోక్సభ స్థానం బరిలో ఉన్న బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్ దాస్ అలియాస్ బొబిపై సంబల్ వాసులు ప్రశ్నల వర్షం కురిపించారు. మీది ఉత్తరకోస్తా కదా, పశ్చిమ ఒడిశాలో పోటీ చేయడానికి కారణం ఏమిటని? గడిచిన అయిదేళ్లలో ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారో చెప్పాలన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఏంచేశారని ప్రశ్నించారు. శామలాయి అమ్మవారి ఆలయ కారిడార్, ఇతర అభివృద్ధి పనులు నవీన్ చేయించారని, జీఎం కళాశాలకు వర్సిటీగా చేశారని బొబి చెప్పుకున్నారు. తనను గెలిపిస్తే మంచి పనులు చేస్తానన్నారు.
పది గ్యారంటీలకు భరోసా ఉందా?
నువాపడ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ను ఓటర్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న పది గ్యారంటీలపై అడిగారు. చెప్పినవన్నీ మీరు అమలు చేస్తామని భరోసా ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన శరత్ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు జరిగిందని చెప్పుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలహండి... ఎవరిదో విజయమండీ ?
[ 30-04-2024]
పశ్చిమ ఒడిశాలోని కలహండి లోక్సభ స్థానంలో విజేత ఎవరు? ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిజద, భాజపా, కాంగ్రెస్ నాయకత్వాలు ఈసారి కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చాయి. విజయానికి ఇక్కడ కొన్ని కులాలు నిర్ణయాత్మకమవుతున్నాయి. -
నేడు నవీన్ నామినేషన్
[ 30-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
సంబల్పూర్ నుంచి నాగేంద్ర... కటక్కు సురేష్
[ 30-04-2024]
సంబల్పూర్ మాజీ ఎంపీ నాగేంద్ర ప్రధాన్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నారు. కటక్ నుంచి సురేష్ మహాపాత్ర్ బరిలో దిగారు. -
పోటీకి నిలిచిన రోజు కూలీ, రాజ మేస్త్రీ
[ 30-04-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని భంజనగర్, అస్కా అసెంబ్లీ స్థానాలకు సీపీఐ (ఎంఎల్) రెడ్స్టార్ తరపున రోజు కూలీ, మరో రాజ మేస్త్రీ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
వర్ష బీభత్సం
[ 30-04-2024]
కొరాపుట్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం పెనుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. -
దక్షిణంలోనూ కమల వికాసం
[ 30-04-2024]
రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల బిజద పాలన చూసిన ప్రజలకు ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని, భాజపాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న ధ్యేయంతో ఉన్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. -
నిన్న నువ్వా, నేనా... నేడు నువ్వే నేను
[ 30-04-2024]
‘మేమిద్దరం ఈసారి సహోదరులం’ చేతులు కలిపిన ఇద్దరం బిజద లెక్క తేలుస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ఈ ప్రాంతాభివృద్ధికి కలసిమెలసి పని చేస్తాం’ అంటూ బ్రహ్మపుర భాజపా లోక్సభ అభ్యర్థి ప్రదీప్కుమార్ పాణిగ్రహి, గోపాల్పూర్ అసెంబ్లీ బరిలో ఉన్న బిభూతి భూషణ్ జెనా ప్రచారం చేస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం
[ 30-04-2024]
బ్రహ్మపురలోని పురాతన సిటీ హైస్కూల్లో 1971 సంవత్సరం మెట్రిక్యులేషన్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి ఉత్సాహంగా జరిగింది. -
ఎన్నికల నిబంధన ఉల్లంఘన..
[ 30-04-2024]
గజపతి జిల్లాలో ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలు ప్రక్రియ ముగియకముందే ముఖ్యమంత్రి చిత్రాలతో పాటు రాష్ట్ర పథకాల ప్రచార హోర్డింగులు దర్శనమిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ మంత్రి
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా